23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్నీ సోము వీర్రాజు బీజేపీలో కలిపేస్తారట..!

సోము వీర్రాజు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారంటూ.. సోషల్ మీడియాలో ప్రచాంం జరుగుతూంటే.. ఆయన మాత్రం రివర్స్‌లో టీడీపీని ఖాళీ చేస్తామని ప్రకటిస్తున్నారు. గతంలో టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ.. అధికార పార్టీ చేసే తప్పుల్ని ఎండగడతామని చెబుతూ.. తీవ్రమైన విమర్శలు చేసిన సోము వీర్రాజు..ఇప్పుడు.. అధికార పార్టీ కంటే.. ప్రతిపక్షాన్నే ఎక్కువగా విమర్శిస్తున్నారు. పైగా ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తామని భీకరమైన ప్రకటనలు చేస్తున్నారు. ప్రతిపక్షాన్ని లేకుండా చేయడానికి… ఆయన అధికార పార్టీ కూడా కదా.. అనే డౌట్ చాలా మందికి వస్తుంది. కానీ.. ఆయన తరచూ వైసీపీ నేతలతోనే.. సమావేశమవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో కూడా సమావేశమై.. తన ఎజెండాను.. బయటకు వచ్చాక ప్రకటించారు కూడా. ఇప్పుడు.. మరింత దూకుడుగా.. టీడీపీని ఖాళీ చేస్తామనే ప్రకటనలు చేస్తున్నారు.

కొద్ది రోజులుగా గంటా శ్రీనివాసరావు.. బీజేపీ నాయకులను కలుస్తూ బిజీగా ఉన్నారు. విశాఖ లో భూకబ్జాల వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో ఎందుకైనా మంచిదన్నట్లుగా ఆయన టీడీపీలో చక్రాలు తిప్పి.. ఆనక బీజేపీలో చేరిపోయిన తన పాతమిత్రులు సీఎం రమేష్, సుజనా చౌదరిలతో కలిసి.. ఢిల్లీలో మకాం వేశారు. అమిత్ షా, మోడీ అపాయింట్మెంట్ల కోసం.. ప్రయత్నాలు చేశారు. ఇద్దర్నీ కలిశారు కూడా. దీంతో… గంటాకు కొంత ధైర్యం వచ్చింది. బీజేపీలో చేరకపోయినా.. ఆ పార్టీకి దగ్గరే అన్న భావన మాత్రం పంపుతున్నారు. దీనికే.. సోము వీర్రాజు రెచ్చిపోతున్నారు. గంటా శ్రీనివాసరావు తమను కలిశారని.. మిగతా వారిని కూడా లాగేస్తామని.. ఈ అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం వస్తుందని.. ప్రకటించేస్తున్నారు.

సోము వీర్రాజు.. టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యారు. కానీ బీజేపీ తరపున ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఎంటరవ్వాలంటే.. కచ్చితంగా ప్రజలు కమలం గుర్తుపై ఓట్లు వేయాలి. ఆ విషయాన్ని ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేల్ని చేర్చుకుని వారినే బీజేపీ సభ్యులుగా ప్రకటించుకుంటామంటూ.. సంబర పడిపోతున్నారు. అలా చేస్తే.. అనర్హతా వేటు వేస్తామని జగన్ చెబుతున్నారు. అలాంటి ప్రాబ్లం లేకుండా.. 23 మందినీ చేర్చేసుకుంటామని సోము వీర్రాజు… స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారు. అంటే.. ఆయన ఉద్దేశం.. చంద్రబాబును కూడా వదిలి పెట్టరన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close