వీర్రాజుకు ఏపీ ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించరా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి.. ఆ పార్టీ నాయకులకు ఓ మాదిరిగా కూడా కనిపిస్తున్నట్లుగా లేరు. కళ్ల ముందు కనిపిస్తున్న దాన్ని కూడా అదంతా అబద్దం నమ్మద్దు.. అలాంటిదేమీ జరగదని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమను వంద శాతం అమ్మడానికి ప్రక్రియను ట్రాక్ ఎక్కించిన కేంద్రం… మరో నాలుగైదు నెలల్లోనే పని పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇదంతా బహిరంగరహస్యం.. అయితే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం.. అబ్బే అసలు స్టీల్ ఫ్యాక్టరీ అమ్మే ఉద్దేశం కానీ.. అమ్మాలన్న ఆలోచన కానీ కేంద్రానికి లేదని .. ప్రైవేటు పరం అయ్యే చాన్స్ లేదని చెప్పుకొస్తున్నారు.

ఆందోళలన్నీ పని లేక చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొస్తున్నారు. సోము వీర్రాజు మాటలు.. స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు సామాన్యులను కూడా విస్మయం కలిగిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని మొదట్లో ప్రగల్భాలు పలికి.. ఢిల్లీకి వెళ్లి.. నాలుగైదు రోజులు గడిపి.. వచ్చారు కానీ.. ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకురాలేకపోయారు.పైగా వచ్చిన తర్వాత ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజాలు చెప్పకుండా… జరుగుతున్ననిజాన్ని కూడా తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏం జరిగినా.. జరగలేదని చెబితే.. నమ్మేసే స్థాయిలో ప్రజల రాజకీయ పార్టీలపై భక్తి.. మూఢత్వం పెంచుకున్నారని.. పార్టీని నమ్మని వాళ్లు ఏం చెప్పినా.. చేసినా నమ్మరన్న అభిప్రాయానికి వచ్చేసినట్లుగా ఉన్నారు. ఇలా అడ్డగోలుగా వాదిస్తూ… ప్రజల్ని మోసం చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. వీర్రాజు తీరుపై ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు. కానీ మొదటి నుంచి బీజేపీ నేతల తీరు అంతేనని.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ప్రతి చిన్న విషయాన్ని ఆరోపణలు చేసి హడావుడి చేసిన బీజేపీ నేతలు.. ఇప్పుడు ఎక్కడా కనిపించకపోవడమే దానికి సాక్ష్యమని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close