సోనియా రాజకీయ కార్యదర్శిపై ఈడీ గురి..!

సోనియా రాజకీయ కార్యదర్శిగా సుదీర్ఘ కాలంగా వ్యవహరిస్తున్న అహ్మద్ పటేల్‌ ఆర్థికపరమైన అవకతవకల చిక్కుల్లో పడ్డారు. గతంలో.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఇన్ ఫ్రా కంపెనీ సోదాల్లో… కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చినట్లుగా తేలినట్లుగా ప్రచారం జరిగింది. ఆ విరాళాల విషయంలో అహ్మద్ పటేల్‌కు ఈడీ సమన్లు ఇచ్చింది. కానీ గతంలో ఆయన హాజరు కాలేదు. ఆ కేసు నడుస్తూండగానే.. తాజాగా.. మరో ఆర్థికపరమైన అవకతవక కేసులో ఆయనను ఈడీ టార్గెట్ చేసింది. కుంటి సాకులు చెప్పి ఆయన విచారణకు ఎగ్గొడుతూండటంతో.. నేరుగా ఆయన ఇంటికే వెళ్లి విచారణ జరిపింది.

సందేశార అనే వ్యక్తులకు చెందిన కంపెనీల స్కాంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ.. అహ్మద్‌ పటేల్‌కు గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే వయోవృద్ధులు తమ ఇళ్లకే పరిమితం కావాలన్న కొవిడ్‌-19 వ్యాప్తి మార్గదర్శకాల అనుసారం.. తాను హాజరు కాలేనంటూ అహ్మద్‌ పటేల్‌ తన అనాసక్తిని వెలిబుచ్చారు. దీంతో ఈడీ, దర్యాప్తు బృందాన్ని సెంట్రల్‌ ఢిల్లీలని మదర్‌ థెరిసా క్రిసెంట్‌ వద్దనున్న ఆయన ఇంటికే పంపారు. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ సంస్థకు చేతన్ సందేశారా‌, నితిన్‌ సందేశారా అనే వ్యక్తులు యజమానులు. వారు ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణాలను పొందింది. రుణాలను దారి మళ్లించి వారు ఆఫ్రికా పారిపోయారు.

సందేశరా సోదరుల నుంచి అహ్మద్‌ పటేల్‌కు డబ్బులు ముట్టినట్లు ఆధారాలు ఉన్నాయి. దీనిపై ఈడీ విచారణ చేపట్టాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనిపై ఈడీతో పాటు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు కూడా ఆయన్ను విచారించారు. కాంగ్రెస్ ఇప్పటికే చిక్కుల్లో ఉంది. ఆ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు.. ఆర్థికపరమైన అవకతవకల కేసుల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు అహ్మద్ పటేల్ వంతు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close