భక్తి: సాయి సత్యవ్రతం ఎలా ప్రారంభమైంది?

కష్టాల్లో చిక్కుకున్న వారు తమ కష్టాలు దైవకృపతో తొలగిన తర్వాత సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. షిర్డీ సాయి సత్య వ్రత విధానం మొదటి నుంచీ లేదు. ఒక భక్తుడు (భీమాజీ పటేల్) కష్టాలను బాబా తొలగించడంతో అతను చాలా నిష్ఠగా సాయి సత్య వ్రతం చేయసాగాడు. ప్రతి గురువారం విధిపురస్సరంగా ఈ వ్రతాన్ని చేసేవాడు. భీమాజీ పటేల్ ప్రవేశపెట్టిన సత్యసాయి వ్రతం షిర్డీలో పరిపాటైంది. అప్పటి నుంచి సాయిసత్యవ్రతం పరంపరగా వాడుకలోకి వచ్చింది. ఒక భక్త శిఖామణి ప్రవేశపెట్టిన ఈ సాయి వ్రతం వెనుక ఉన్న పూర్వాపరాలను విశిదపరిచే ప్రయత్నం ఇది…

పూణె జిల్లాలోని జున్నార్ తాలూకాలో నారాయణ గాం అనే ఊరుంది. ఆ ఊరి పటేల్ – భీమాజీ. ఇతను సంపన్నుడు. పైగా దయాగుణం ఎక్కువ. ఎంతమంది అతిథులు వచ్చినా కాదనకుండా భోజనాలు పెట్టేవాడు. మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకునేవాడు. అలాంటి సద్గుణునికి కర్మయెక్క పర్యవసానంగా కఫక్షయ రోగం పుట్టుకొచ్చింది. భరించలేనంత దగ్గుతో బాధపడేవాడు. నోటి నుంచి రక్తం గడ్డలుగా పడుతుండేది. బాధ తట్టుకోలేక ఎందుకో నానాసాహేబు కు ఉత్తరం రాయాలనిపించింది. నానా ఏదైనా సహాయం చేయగలడేమోనన్న ఆశతో ఉత్తరం రాశాడు భీమాజీ. అటు నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. `వెంటనే షిర్డీకి వెళ్లు, సాయిబాబావారి పాదాలను ఆశ్రయించు. ఇదొక్కటే తరుణోపాయం. వారి దర్శనంతో మహారోగాలే మాయమవుతాయి. ఏమాత్రం సందేహపడకుండా బాబావారి పాదాలను గట్టిగా పట్టుకో. వారొక్కరే నిన్న నిర్భయుల్ని చేయగలరు’ అంటూ నానా సాహేబు సలహా ఇచ్చారు.

ఈ సలహా మేరకు భీమాజీ షిర్డీ వెళ్ళాడు. అతను లేచి నడిచేస్థితిలో లేడు. బండి మసీదు పక్కన వరకు వచ్చింది. భీమాజీని నలుగురు మోసుకుని పైకి తీసుకువచ్చారు. నానా సాహేబు, మాధవరావు ఆ పక్కనే ఉన్నారు. బాబావారు ఈ పటేలు పరిస్థితి గమనించారు. `ఈ దొంగను ఎక్కడి నుంచి తీసుకువచ్చి నా మీద పడేశారు. ఇదేమైనా మంచి పనేనా!’ అనగానే, భీమాజీ కాస్తంత బిత్తరపోయి, తిరిగి ధైర్యం తెచ్చుకుని, `బాబా, మీరు తప్ప నన్ను మరెవ్వరూ రక్షించలేరం’టూ వేడుకున్నాడు. ఆ వెంటనే బాబావారు భీమాజీకి ధైర్యం చెప్పి, నిశ్చింతగా వెళ్లి భీమా బాయి ఇంట్లో ఉండమని అనుజ్ఞ ఇచ్చారు. బాబా విభూతిని తెప్పించి కొంచం భీమాజీ చేతిలో ఉంచి, కొద్దిగా అతని నుదుట రాసి అతని శిరసుపై తమ హస్తం ఉంచారు. తర్వాత బసకు చేరుకోమని అనుజ్ఞ ఇచ్చారు. బబావారి ఆశీస్సులతో భీమాజీకి హుషారు వచ్చినట్లయింది. అంతకుముందు నడవలేని స్థితిలో ఉన్న భీమాజీ, హుషారుగా బండి వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు.

బసలో ఆ రాత్రి పడుకున్నప్పుడు అతగాడికి ఓ కల వచ్చింది. అది అతని బాల్యంనాటి సంఘటనను పోలిఉంది. చిన్నతనంలో తనకు చదువుచెప్పిన మాస్టారు కనిపించి, పద్యం సరిగా కంఠస్తం చేయలేదంటూ బెత్తంతో వీపు చితకబాదాడు. ఆ తర్వాత మరో కల వచ్చింది. ఈ కలలో ఎవరో ఒక గృహస్థుడు వచ్చి భీమాజీ ఛాతీమీద కుర్చున్నాడు. అక్కడితో ఆగలేదు. చేతిలో పొత్రం (పప్పు రుబ్బడానికి ఉపయోగిస్తారు) తీసుకుని భీమాజీ ఛాతీపై గట్టిగా రుద్దడం ప్రారంభించాడు. ప్రాణాలు పోతున్నట్లు అనిపించింది భీమాజీకి. కల అయ్యాక బాగా నిద్రపట్టేసింది. ఉదయం లేచేసరికి ఎన్నడూ లేనంత హుషారు పుట్టుకొచ్చింది. తాను వ్యాధిగ్రస్థుడినన్న విషయం మరచిపోయాడు. పరుగుపరుగున బాబా దర్శనానికి బయలుదేరాడు. బాబాను దర్శనం చేసుకుంటూ వారి లీలలను కొనియాడాడు. బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడే నెలరోజులపాటు ఉండిపోయాడు. అప్పుడే సత్యనారాయణస్వామివారి వ్రతంలాగానే సాయివ్రతం చేయడం ప్రారంభించాడు.

దాసగణు అప్పటికే రచించిన అర్వాచీన భక్తలీలామృతం లోని సాయి చరిత్రను ప్రేమపూర్వకంగా భీమాజీ చదివేవాడు. దాసగణు రాసిన ఈ గ్రంథంలో 45 అధ్యాయాలు ఉండగా, మూడు అధ్యాయాల్లో సాయినాథుని గురించి ఉంది. ఈ మూడే సాయిసత్యవ్రత కథలుగా భీమాజీ చదివేవాడు. అలా అతను అపరిమితమైన సౌఖ్యం పొందేవాడు. పూజాపద్ధతి, నైవేద్యం అంతా సత్యనారాయణ వ్రతంలాగానే ఆచరించేవాడు. ఈ రెండు వ్రతాల మధ్య తేడా అనేదే కనిపించేది కాదు. ఆ నాటి నుంచి ప్రతి గురువారం సత్యసాయి వ్రతం చేసుకోవడం భక్తులకు పరిపాటైంది. దీని వల్ల భక్తులకు, సుఖసంతోషాలను శ్రీ సాయిబాబావారు ప్రసాదిస్తున్నారు.

(భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్ఛరితలోని 13వ అధ్యాయంలో భీమాజీ పటేల్ సత్యసాయి వ్రత ఆచరణ ప్రస్తావన ఉన్నది. ఓం సాయి నమోనమః)

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close