మోడీ పిలుపునిచ్చిన తర్వాత సమస్యలు రావడమా..!?

ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల సేపు లైట్లు ఆర్పేసి.. కొవ్వొత్తులు వెలిగిలించి చీకట్లు పారదోలమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుపై .. విద్యుత్ నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కరెంట్ వినియోగం ఒక్క సారిగా నిలిపివేస్తే.. గ్రిడ్ కుప్పకూలుతుందనే ఆందోళన వ్యక్తమయింది. అయితే.. ఇలాంటి సమస్యలన్నింటినీ తాము పరిష్కరించుకుంటామని.. ప్రజలంతా… మోడీ చెప్పినట్లుగా లైట్లు ఆర్పేసి.. క్యాండిల్స్ వెలిగించాలని భరోసా ఇచ్చాయి. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సాహ్లి లేఖ రాశారు. అందరూ ఒకే సారి లైట్లు ఆపివేయడం వల్ల గ్రిడ్‌పై ఒకేసారి ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

కొన్ని నిబంధనలను.. ఈ మేరకు.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం పంపింది. వీధి లైట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని స్పష్టం చేసింది. వీధి లైట్లు, శాంతి భద్రతల విషయంలో స్థానిక ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కేంద్రం తెలిపింది. ఆలాగే ఆస్పత్రులు సహా అన్ని అత్యవసర ప్రదేశాల్లో లైట్లు ఆపాల్సిన పని లేదని రాష్ట్రాలకు పంపిన సూచనల్లో స్పష్టం చేసింది. విద్యుత్ గ్రిడ్ ప్రత్యేకమైనది. దానిలో కరెంట్ ప్రసారం నిరంతరాయంగా ఉండాలి. అదీ కూడా సామర్థ్యం మేరకు ఉండాలి. ఎక్కవైనా.. తక్కువైనా.. గ్రిడ్ ఫెయిలవుతుంది. అది అన్ని స్థాయిల్లోనూ ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్లు కూడా లోడ్ ఎక్కువైతే కాలిపోతూంటాయి. ఈ సాంకేతిక అంశాలతో.. ప్రధానమంత్రి మోడీ పిలుపుతో గందరగోళం ఏర్పడింది.

అయితే.. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి.. కేంద్రమే ముందుకు వచ్చింది. మోడీ పిలుపునకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని నిర్ణయించుకుంది. దే్శంలో ఇప్పుడు.. విద్యుత్ వినియోగం తక్కువగా ఉంది. పారిశ్రామిక సంస్థలన్నీ ఉత్పత్తిని నిలిపివేయడంతో.. కరెంట్ మిగులు ఉంది. దీంతో అతి తక్కువ వినియోగం జరుగుతోంది. మోడీ పిలుపుతో దేశ వ్యాప్తంగా కరెంట్ వినియోగం నిలిపివేస్తే మరింత తగ్గుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close