అమరావతి శంకుస్థాపనకు ఆటంకం: స్టే ఇస్తూ సంచలన తీర్పు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తుండగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇవాళ సంచలన ఉత్తర్వులు వెలువరించింది. తుళ్ళూరు పరిధిలో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భూమి చదును పనులను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పర్యావరణ అనుమతులు మంజూరయ్యేవరకు పనులు చేపట్టకూడదని ఆదేశించింది. తోటలను తొలగించకూడదని సూచించింది. తోటలను తొలగిస్తున్నట్లు చూపిస్తున్న సాక్ష్యాలను పిటిషనర్ ట్రిబ్యునల్‌కు సమర్పించారు. ముంపు, తడి ప్రాంతాలను గుర్తించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలుపుకోలేదని అభిప్రాయపడింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 5 తేదీకి వాయిదా వేసింది.

రాజధాని అమరావతిని సారవంతమైన, పంటలు పండే భూమిపై, అదికూడా వరదలు సంభవించటానికి అవకాశమున్న ప్రాంతంలో నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ పి.శ్రీమన్నారాయణ అనే వ్యక్తి సుప్రీమ్ కోర్ట్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. సుప్రీమ్ కోర్ట్ ఈ కేసును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు బదిలీ చేసింది. ప్రభుత్వం ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ స్టే రావటం సంచలనమే. ప్రభుత్వం ఇప్పుడు దీనిపై ఎలా ముందుకెళుతుందో చూడాలి. సోమవారం స్టేపై అప్పీల్ చేసే అవకాశాలున్నాయి.

శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై ఏపీ క్యాబినెట్ సమావేశం ఇవాళ విజయవాడలో జరుగుతుండగానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు వెలువడటం విశేషం. మరోవైపు శంకుస్థాపన కార్యక్రమ ఆహ్వాన పత్రిక ఇవాళ సిద్ధమయింది. ఆ పత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ మీడియాకు విడుదలచేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close