సుధీర్ బాబు సైలెంట్ గా మొదలెట్టాడు

బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ పాతైపోయింది. ఇప్పటికే బోలెడు సినిమాలు ఈ వరుసలో వచ్చేశాయి. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. సావిత్రి జీవిత క‌థ‌ని `మ‌హాన‌టి` పేరుతో తెర‌కెక్కిస్తున్నారు. దాసరి , ఎన్టీఆర్ లపై బయోపిక్ ప్రకటనలు వచ్చాయి.

ఇలా భారత బ్యాడ్మింటన్‌ సంచలనం పుల్లెల గోపీచంద్ క‌థ‌ని సినిమాగా తీయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఒకప్పుడు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పుల్లెల గోపీచంద్‌, రిటైర్మెంట్‌ తర్వాత కోచ్‌గా మారారు. అనేక అటుపోటులను ఎదుర్కొని తన స్టూడెంట్ ఒలిపింక్స్ మెడల్ వరకూ తీసుకోచ్చారు. ఒలింపిక్‌ లో రజతం సాధించి రికార్డు సృష్టించింది పీవీ సింధు. దేశమంతా ఇప్పుడు ఆమె పేరు మార్మ్రోగిపోతుంది. అదే సమయంలో ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌ పేరు కూడా.

ఇప్పుడు ఇదే నేపద్యంలో పుల్లెల గోపీచంద్ బయోపిక్ తెరపై వచ్చింది. ఈ సినిమాలో మొదటి నుండి సుదీర్ బాబు పేరు వినిపిస్తుంది. ప్రవీణ్ సత్తార్ దర్సకత్వంలో ఈ సినిమా ఉటుందని అన్నారు. నిజమే.. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో గోపీచంద్ బయోపిక్ రెడీ అవుతుంది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా అప్పుడే సైలంట్ గా సెట్స్ పైకి వెళ్ళిపోయిందట. ఈ విషయాన్ని సుదీర్ బాబే చెప్పాడు. గోపీచంద్ బయోపిక్ లో నటించడం లక్కీగా ఫీల్ అవుతున్నా. షూటింగ్ కూడా మొదలైయింది. ఈ సినిమా కోసం విదేశీ నిపుణులు కూడా పనిచేస్తున్నారు” అని చెప్పుకొచ్చాడు సుదీర్. ప్రస్తుతం రాజశేఖర్ తో గరుడ వేగ చేస్తున్న ప్రవీణ్ సత్తారు.. ఈ బయోపిక్ ను సైలంట్ గా మొదలుపెట్టేయడం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.