సుక్కు సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉండ‌బోతోంది?

త‌న ప్ర‌తీ సినిమాలోనూ క‌థానాయ‌కుడ్ని కొత్త‌గా ఆవిష్కరించ‌డం సుకుమార్ స్టైల్‌. ఆర్య‌లో బ‌న్నీని, రంగ‌స్థ‌లంలో రామ్‌చ‌ర‌ణ్‌నీ, నాన్న‌కు ప్రేమ‌తోలో ఎన్టీఆర్‌నీ స‌రికొత్త‌గా చూపించాడు. ఇప్పుడు మ‌హేష్‌బాబుతో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో మ‌హేష్ లుక్‌పై ప్ర‌త్యేక దృష్టిసారించాడు సుకుమార్‌. ఇది వ‌ర‌కు మ‌హేష్‌తో చేసిన వ‌న్ – నేనొక్క‌డినేలో మ‌హేష్ లుక్‌లో ఎలాంటి మార్పులూ చేయ‌లేక‌పోయాడు. ఆ లోటు ఈ సినిమాతో తీర్చుకుందామ‌ని సుకుమార్ ఆలోచ‌న‌.

రంగ‌స్థ‌లం, నాన్న‌కు ప్రేమ‌తో చిత్రాల్లో క‌థానాయ‌కులు గ‌డ్డంతో క‌నిపించారు. ఆ స్థాయి గుబురు గ‌డ్డంతో నటించ‌డం ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌ల‌కు అదే తొలిసారి. మ‌హేష్‌ని కూడా గెడ్డంతో చూపిస్తే ఎలా ఉంటుంది? అనేది సుకుమార్ ఆలోచ‌న‌. మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కూ అలాంటి లుక్‌లో క‌నిపించ‌లేదు. ఎప్పుడూ నూనూగు మీసాల‌తోనే ద‌ర్శ‌న‌మిచ్చే మ‌హేష్‌…. గ‌డ్డంతో క‌నిపించ‌డం సమ్‌థింగ్ స్పెష‌లే. కానీ ఈ లుక్ మ‌హేష్‌కి సూట‌వుతుందా? లేదా? చూసుకోవాలి. అందుకోసం.. ట్రైల్ షూట్ చేయాల‌నుకుంటున్నార్ట‌. మ‌హ‌ర్షి ప‌నులు అయిపోగానే.. మ‌హేష్‌కి ఈ కొత్త లుక్ ట్రై చేస్తారు. సూట్ అయితే… అదే లుక్‌తో మ‌హేష్ క‌నిపిస్తాడు. లేదంటే మ‌రో లుక్ కి షిఫ్ట్ అవ్వాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close