స‌గం సినిమా ఫ్లై ఓవ‌ర్ మీద తీసేశార‌ట‌!

కొత్త‌ద‌నం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకొంటూ, ప‌రుగులు పెడుతున్నాడు సందీప్ కిష‌న్‌. త‌నో సినిమా చేస్తున్నాడంటే క‌థ‌లో ఏదో ఓ థ్రిల్లింగ్ పాయింట్ ఉంటుంద‌ని ఫిక్స్ అయిపోయారు జ‌నాలు. సినిమా హిట్ట‌యినా, ఫ్లాప్ అయినా. పాయింట్ పరంగా నావెల్టీ ఉన్న స‌బ్జెక్ట్స్‌ని ఎంచుకొంటున్నాడు సందీప్‌. ప్ర‌స్తుతం తాను చేస్తున్న ఒక్క అమ్మాయి త‌ప్ప కూడా అలాంటి క‌థే! నిత్య‌మీన‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి రాజ‌సింహా ద‌ర్శ‌కుడు. ఈ క‌థ‌లో కొత్త‌ద‌నం ఏంటంటే.. సినిమాలో 60 శాతం షూటింగ్ హైటెక్ సిటీ ఫ్లైఓవ‌ర్‌పై జ‌రిగింద‌ట‌. స‌గం సినిమా ఫ్లైఓవ‌ర్ నేప‌థ్యంలోనే ఉంటుంద‌ని.. ఇది ట్రాఫిక్ జామ్ లో జ‌రిగే క‌థ అని సందీప్ కిష‌న్ చెబుతున్నాడు. లైన్ వింటుంటూనే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. మ‌రి రాజ‌సింహా ఎలా తీశాడో మ‌రి.

”2012 సంవ‌త్స‌రంలోనే రాజ‌సింహా ఈ క‌థ నాకు చెప్పాడు. అయితే.. చాలా టిపిక‌ల్ పాయింట్ ఇది. దాన్ని ఎలా ప్ర‌జెంట్ చేస్తాడో అనిపించింది. క‌థ‌పై బాగా న‌మ్మ‌కం కుదిరాకే.. సెట్స్‌పైకి తీసుకొచ్చాం. ఫ్లై ఓవ‌ర్ నేప‌థ్యంలో సినిమా తీయ‌డం మామూలు విష‌యం కాదు. క‌థ చెప్పి మేం న‌మ్మించాలి. అందుకోసం మేం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఆ క‌ష్టానికి త‌గిన ఫ‌లితం వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌”న్నాడు. అన్న‌ట్టు శ‌నివారం సందీప్ కిష‌న్ పుట్టిన రోజు, ఈ యంగ్ హీరోకి బ‌ర్త్‌డే విషెస్ చెప్పేయండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close