కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న సునీల్

సునీల్ అనగానే భీమవరం యాసలో కామెడీతో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ గుర్తుకు వస్తాడు. అయితే కొంచం క్రేజ్ వచ్చే సరికి తను సోలో హీరోగా చేసినా ప్రేక్షకులు ఆమోదిస్తారనే భరోసాతో హీరోగా మారాడు. అయితే తాను హీరోగా మారింది తన కోసం కాదని.. స్టార్ హీరోల సినిమాల్లో నటించేప్పుడు దర్శక నిర్మాతల వల్ల ఇబ్బంది ఫీల్ అయ్యే హీరోగా మారానని కటింగ్స్ ఇచ్చినా సునీల్ ఇప్పుడు హీరో.. అయితే కమెడియన్ గా ఎంత హిట్ అయ్యాడో హీరోగా అంత ఫ్లాప్ అవుతున్నాడు.

తీస్తున్న సినిమాలన్ని అపజయాల బాట పట్టడంతో రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరి కృష్ణాష్టమి తీశాడు సునీల్. దిల్ రాజు నిర్మాణంలో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే. అందులోనే దిల్ రాజు ఊరకనే సినిమాలు తీసేయడు. మరి అలాంటి శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ టీం అంతా కలిసి రెడీ చేసిన సినిమా కథ ఇలా కలగూరలా ఉందే అన్న డౌట్ వారికి రాలేదు అనుకుంటా.. కాస్త కూస్తో సునీల్ కు డౌట్ వచ్చినా దిల్ రాజు మీద ఉన్న నమ్మకంతో పాత కథ అయినా స్పెషల్ ట్రీట్ మెంట్ ఇప్పిస్తాడనుకున్నారు.

తీరా వాసు వర్మ తీసిన కృష్ణాష్టమి చూస్తే సునీల్ అసలు హీరోగా ఎందుకు మారాడు అన్న డౌట్ కూడా వస్తుంది. తన కెరియర్ లో ఎలాంటి సినిమాలు చేయాలి అనే నిర్ణయాలను తెలివిగా తీసుకోగలిగిన వాడే హీరోగా నిలబడగలుగుతాడు. అయితే సునీల్ దానిలో చాలా వెనుకబడి ఉన్నాడని చెప్పాలి అందునా సునీల్ కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మరి ఇప్పటికైనా సునీల్ ఆలోచించి సినిమాలు చేస్తే బెటర్ లేదంటే అసలకే మోసం వచ్చే పరిస్థితి ఎదురవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close