వరుస సర్వేలన్నీ బీజేపీకి కొత్త మిత్రులను వెదికి పెట్టడానికా..?

భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గుతాయి కానీ.. మిత్రపక్షాలతో కలిసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమంటూ.. కొద్ది రోజుల నుంచి బీజేపీ అనుకూల మీడియా చానళ్లు రోజు మార్చి రోజు సర్వేలతో హోరెత్తిస్తున్నాయి. ఇవన్నీ దాదాపుగా అతిశయోక్తులకు దగ్గరగా ఉంటున్నాయి కానీ వాస్తవాలను ప్రతిబింబించం లేదు. ఏపీలో బీజేపీకి ఏకంగా ఏడు లోక్ సభ సీట్లు ఇచ్చేసిందో సర్వే. దీనికి తగ్గట్లుగానే ఇతర సర్వేలూ బయటకు వస్తున్నాయి. ఏపీ విషయంలో ప్రత్యేకంగా అంత ఘోరమైన సర్వే మళ్లీ రాలేదు కానీ.. ఓవరాల్ గా మాత్రం బీజేపీకి ఒకే రకమైన సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. వరుసగా వస్తున్నఈ సర్వేల వెనుక బీజేపీ స్ట్రాటజీ ఉందన్న ప్రచారం ఢిల్లీ మీడియా వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి నిఖార్సైన మిత్రపక్షం లేదు. శివసేన ఎప్పుడో కటిఫ్ చెప్పింది. శివసేనతో కలిసి పోటీ చేయాలనుకుంటే.. బీజేపీ చాలా వదులుకోవాల్సి ఉంటుంది. ఇక బీహార్ లో జేడీయూతో కూడా అదే పరిస్థితి. ఈ రెండు రాష్ట్రాల్లో రాజీ పడితే.. బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం… ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అలాగే.. ఇతర చిన్నాచితకా మిత్రపక్షాలు కూడా.. బీజేపీ గెలిచే చాన్స్ ఉందంటేనే ఆలోచిస్తున్నాయి. ఏ మాత్రం తేడాగా ఉన్నా… బీజేపీకి జెల్ల కొట్టడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ పార్టీలను నిలుపుకోవడంతో పాటు.. కొత్త పార్టీలను ఎన్డీఏలోకి ఆకర్షించడానికే.. బీజేపీ ఇప్పుడు మళ్లీ గెలవబోతోందన్న ప్రచారాన్ని ప్రారంభించినట్లు భావిస్తున్నారు.

ఉత్తరాదిలో తగ్గిపోయే సీట్లను.. దక్షిణాదిలో బీజేపీ భర్తీ చేసుకోవాలనుకుంటోంది. అయితే అది సొంతంగా సాధ్యం కాదు. సీట్లు సాధించేవారిని మిత్రులుగా చేసుకోవడమే బీజేపీ ముందున్నప్రథమ కర్తవ్యం. తమిళనాడులో అన్నాడీఎంకే. ఒడిషాలో బిజూ జనతాదళ్, తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ బీజేపీ హిట్ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఈ పార్టీలన్నీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి భయపడుతున్నాయి. వారికి ధైర్యం చెప్పడానికి.. .. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నా…. పరిస్థితి తేడాగా ఉండదని చెప్పడానికే ఈ సర్వేలన్నీ వరుసగా బయటకు వదులుతున్నారన్న ప్రచారం ఉంది. అందుకే… ఇటీవలి కాలంలో వైసీపీ వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. ప్రత్యేకహోదా పై బీజేపీ మాట ఇస్తే.. ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు మెల్లగా ప్రారంభిస్తున్నారు. అదే జరిగితే సర్వేల ఫలితం బీజేపీకి దక్కినట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close