బీజేపీలో చేరిన పరిపూర్ణానంద..! తెలంగాణ ఎన్నికలే టార్గెట్..?

కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి రాజకీయ రంగ ప్రవేశ ప్రవేశం చేశారు. అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ కోసం… బీజేపీ సిద్ధాంతాల కోసం … మనసా, వాచా పని చేస్తానని ప్రకటించారు. అయితే పరిపూర్ణానంద ఏ రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తారనేది బహిరంగంగా ప్రకటించకపోయినా.. తెలంగామనే టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. శనివారం.. తెలంగాణ నేతలతో… బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశం కాబోతోంది. ఆయన సమావేశానికి పరిపూర్ణానంద కూడా హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరిపూర్ణానంద సేవలను విస్తృతంగా వాడుకోవాలని అమిత్ షా నిర్ణయించుకున్నారు. ఆయనను ఓ అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటిస్తారని కూడా చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేని విధంగా.. ఇటీవలి కాలంలో కొంత మంది స్వామిజీలు పాపులర్ అయిపోయారు. గతంలో చినజీయర్ లాంటి ఒకరిద్దరు మాత్రమే… ప్రజలకు తెలుసు. వారు కూడా.. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే పాల్గొనేవారు. రాజకీయాలు మాట్లాడటం పరమపాపం అన్నట్లు ఉండేవారు. కానీ ఈ పరిస్థితి గత నాలుగేళ్లలో పూర్తిగా మారిపోయింది. కొంత మంది స్వాములు ఇప్పుడు రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నారు. విశాఖ శారదాపీఠం పేరుతో.. స్వరూపానందేంద్ర స్వామి చేసే రాజకీయ ప్రకటనలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఇప్పుడు వైసీపీ అధినేత జగన్‌కు ఓ రకంగా ఆస్థాన స్వామిజీగా ఉన్నారు. శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి ఇటీవలి కాలంలో హిందూ బేస్‌గా రాజకీయాలు ప్రారంభించారు. ప్రత్యేకంగా ఓ చానల్ పెట్టి హిందూత్వ పరిరక్షణ అంటూ ఉద్యమాలు ప్రారంభించారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఆయన వదిలి పెట్టడం లేదు.

పరిపూర్ణానంద కొంతకాలం తెలంగాణలోనే సభలు పెడుతున్నారు. గతంలో మహబాబూనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సభలు పెట్టారు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోట్ల ఆ సభలు పెట్టారు. విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ వివాదంలో.. ఆ వ్యాఖ్యలను కారణంగా చూపించే.. పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ చేశారు. ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి వచ్చేశారు కాబట్టి… బీజేపీ తరపున హిందుత్వ మార్క్ రాజకీయాలు తెలంగాణలో మరింత జోరుగా ప్రారంభమవుతాయని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close