చెరో పదిహేనేళ్లు..! సన్యాసికార దీక్షలో స్వరూపానంద రాజకీయ ఆకాంక్షలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు… పదిహేనేళ్ల పాటు దిగ్విజయంగా పరిపాలించాలని స్వరూపానందస్వామి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా సన్యాస స్వీకరణ మహోత్సవం విజయవాడలోని కృష్ణానదీ తీరాన గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో జరిగింది. దీనికి సోమవారం రాజకీయకళ వచ్చింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరితో పాటు.. పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఇద్దరూ సీఎంలు రావడం.. స్వరూపానందను మహాదానందానికి గురి చేసింది. అందుకే ఇద్దరిపై.. ప్రశంసల వర్షం కురిపించారు. పొగడ్తలతో హోరెత్తించారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కేసీఆర్‌ అని సర్టిఫికెట్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ వచ్చి… ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమాన్ని ఆస్వాదించడం శుభపరిణామమన్నారు. కేసీఆర్‌ మహా మేధావి… మహాభారతాన్ని రెండుసార్లు చదివిన వ్యక్తి మా కేసీఆర్‌ అని పొగిడారు.

జగన్‌, కేసీఆర్‌ అంటే నా ప్రాణసమానులన్నారు. అగ్నిసాక్షిగా చెబుతున్నా..నా హృదయంలో ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్‌ అని ఒట్టు వేశారు. 15ఏళ్లు దిగ్విజయంగా కేసీఆర్‌, జగన్‌ పాలించాలన్నారు. ఈ సందర్భంగా శారదా పీఠం గురించి కూడా…స్వరూపానందగొప్పగా చెప్పుకొచ్చారు. భవిష్యత్తును చెప్పే ఏకైక పీఠం విశాఖ శారదాపీఠమేనన్నారు. తెలుగునాట అధర్మం ఓడి ధర్మం గెలిచింది అనేందుకు… ఈ ఇద్దరు రాజులే నిదర్శనమని చెప్పుకొచ్చారు. పూర్తి అధ్యాత్మిక వాతావరణంలో..సన్యాసికార దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ… స్వరూపానంద స్వామి.. ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చిన ఉత్సాహంతో..రాజకీయ ప్రసంగం చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

వ్యక్తిగత, రాగద్వేషాలకు అతీతంగా స్వాములు ఉంటారని చెబుతారు కానీ… స్వరూపానంద మాత్రం… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పొగిడేందుకు.. ఇతరులను విమర్శించడానికి కూడా వెనుకాడలేదు. అంతే కాదు.. శారదాపీఠం జ్యోతిష్యాలయం అయినట్లుగా.. కచ్చితంగా ఊహించి చెప్పగలిగేది.. తమ పీఠం ఒక్కటేనని చెప్పుకుని.. ఇతర పీఠాలను కించ పరిచారనే గుసగుసలు కూడా వినిపించాయి. కానీ.. స్వరూపానంద ఇప్పుడు పవర్ ఫుల్. ఆయన ఎమన్నా.. ఎవరూ నోరు తెరిచే పరిస్థితి లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close