తెలంగాణలో కాంగ్రెస్ – ఢిల్లీలో టీడీపీ..! గొంతు చించుకున్నా “చెల్లదు”..!

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని.. బీజేపీలో విలీనం చేయడం చెల్లదంటూ… టీడీపీలో మిగిలిపోయిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల్లో ఒకరు అయిన… కనకమేడల రవీంద్రకుమార్ వాదిస్తున్నారు. ఆయన సీనియర్ న్యాయవాది. చట్టాలను పుక్కిట పట్టారు. తెలుగుదేశం పార్టీ న్యాయవిభాగానికి చాలా కాలంగా… నేతృత్వం వహించారు. అయినంత మాత్రాన.. ఆయన చట్టంలోని… సెక్షన్లు, పేజీలు చెప్పి… టీడీపీపీ విలీనం చెల్లదని వాదిస్తే సరిపోతుందా..?. ఆ చట్టాలను అమలు చేసేవారు.. దాన్ని ఆమోదించాలి కదా..! ఆమోదించాలో వద్దో.. పవర్స్ ఉన్న వాళ్లే… లెక్కలోకి తీసుకోకపోతే.. వారి వాదనే చెల్లుబాటు కాదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు… ఢిల్లీలో టీడీపీకి అదే పరిస్థితి కనిపిస్తోంది.

టీడీపీ వాదనే చెల్లుబాటు కాదు..! అదంతే..!?

టీడీపీపీని బీజేపీలో విలీనం చేస్తూ… రాజ్యసభ చైర్మన్ నిర్ణయం తీసేసుకున్నారు. అయితే.. ఆ విలీనం ప్రక్రియ చెల్లదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వాదిస్తున్నారు. ఆ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిసి.. పార్టీమారిన నలుగురు రాజ్యసభ సభ్యులపై ఫిర్యాదు చేశారు. విలీనం ప్రక్రియ రాజ్యసభ చైర్మన్‌ పరిధిలో ఉండదని రవీంద్రకుమార్ వాదిస్తున్నారు. విలీనంపై ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుందని, విలీనాన్ని నిర్ణయించే అధికారం స్పీకర్‌, చైర్మన్‌కు ఉండదని కనకమేడల చట్టాలను ఉదహరిస్తున్నారు. కానీ రాజ్యసభ చైర్మన్ పరిశీలిస్తామని చెప్పి ఆయనను పంపేశారు. అది ఈ పాటికి చెత్త బుట్టలోకి చేరిపోయి ఉంటుంది.

తెలంగాణలో కాంగ్రెస్ వాదన ఎక్కడ చెల్లుబాటయింది..!?

తెలంగాణలో కొంత కాలం నుంచి… కాంగ్రెస్ పార్టీ.. ఈ విలీనం చెల్లదని వాదిస్తూ వస్తోంది. ముందస్తు ఎన్నికలు జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ.. విలీనాల్లో.. చిక్కి శల్యమైపోతోంది. మొదట.. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్సీలందర్నీ.. లాగేసుకుని… టీఆర్ఎస్ విలీనం చేసేసుకుంది. దానిపై కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకుంది. విలీనం… మండలి చైర్మన్ చేతుల్లో లేదని గగ్గోలు పెట్టింది. ఆ గగ్గోలు ఆలా సాగుతూండగానే.. ఎమ్మెల్యేలను కూడా లాగేసుకుని… విలీనం చేసేసుకుంది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇప్పటికీ… విలీనం చెల్లదని.. గగ్గోలు పెడుతున్నారు. కోర్టుకు వెళ్లారు. అయినా వారి వాదనే చెల్లడం లేదు.

అధికార పార్టీ ఏది చెబితే.. అదే చెల్లుబాటు.. ! అదే ఫైనల్..!

నిజానికి.. లెజిస్లేచర్ పార్టీల విలీనం అనేది.. ఎక్కడా లేదు. అయితే .. గియితే పార్టీ విలీనం అవుతుంది కానీ.. లెజిస్లేచర్ పార్టీల విలీనం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ… స్పీకర్లు, మండలి చైర్మన్లు, రాజ్యసభ చైర్మన్లు.. ఇవేమీ పట్టించుకోవడం లేదు. వారికి.. చీఫ్ జస్టిస్‌లతో పాటు సమానంగా అధికారాలుంటాయి. అందుకే.. వారు.. తమ తమ పార్టీల అధినేత ఆదేశాలను పాటిస్తున్నారు. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వారికి రాజ్యాంగపరమైన రక్షణ ఉండటంతో.. ప్రతిపక్ష వాదన చెల్లుబాటు కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close