కాపులకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందా?

అందరినీ ఆశ్చర్యపరుస్తూ తెలంగాణా కాంగ్రెస్ ఎంపి వి.హనుమంత రావు ఈరోజు ఉదయం కిర్లంపూడికి వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంని కలిసి ఆయనకి సంఘీభావం తెలిపారు. అందుకు  ఆయనని ఎవరూ తప్పు పట్టలేరు కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని చెప్పుకోవడమే తప్పు. విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం (1994) లోనే కాపులకి రిజర్వేషన్లు ఇవ్వడానికి జిఓ ఇచ్చారని కానీ ఆ తరువాత వచ్చిన తెదేపా ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మాట తప్పడంతోనే ఉద్యమం మొదలయిందని అన్నారు. ఈ సమస్యని ఇంకా ఎక్కువ కాలం నాన్చకుండా తక్షణమే పరిష్కరించుకోవాలని చంద్రబాబు నాయుడుకి సూచించారు.

కాంగ్రెస్ పార్టీ తరువాత సమైఖ్య రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెదేపా పట్టించుకోలేదని ఆరోపిస్తున్న హనుమంత రావు, ఆ తరువాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోలేదనే విషయాన్ని ప్రస్తావించక పోవడం గమనార్హం.  సమైక్య రాష్ట్రంలో తెదేపా తరువాత వై.యస్ రాజశేఖర్ రెడ్డి ఏకధాటిగా ఐదేళ్ళపాటు పరిపాలించారు. ఆయన మరణించిన తరువాత అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన కె. రోశయ్య సుమారు రెండేళ్ళపాటు పరిపాలించారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి  రాష్ట్రం విడిపోయే వరకు మూడేళ్ళపాటు పరిపాలించారు.

కాంగ్రెస్ పార్టీకి నిజంగా కాపుల పట్ల అభిమానం ఉండి ఉంటే పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలించినపుడే గతంలో తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఇచ్చిన జిఓను అమలుచేసి ఉండవచ్చును. కానీ అప్పుడు అసలు ఆ ఊసే ఎత్తలేదు. ఎందుకంటే అది ఒక తేనె తుట్టె వంటిదని వారికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష బెంచీలలోకి వచ్చి కూర్చొంది కనుక మళ్ళీ హనుమంత రావు వంటి కాంగ్రెస్ నేతలు కాపుల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో తెదేపా కూడా ఒకప్పుడు అదే విధంగా వ్యవహరించింది. పైగా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కనుక ఇప్పుడు అది ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవలసి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close