జ‌గన్‌, కేసీఆర్ క‌లిస్తే వైకాపాకి న‌ష్టం లేద‌న్న‌ త‌ల‌సాని!

రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచీ ఆంధ్రా రాజ‌కీయాలే తెరాస‌కు ఎక్కువైపోయాయి. ఆంధ్రాలో వేలు పెడ‌తామ‌ని, వైకాపాతో చేతులు క‌లుపుతున్నారు. ఇక‌, మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అయితే… తెరాస నాయ‌కుడిగా కాకుండా, ఆంధ్రాలో వైకాపాకి అప్ర‌క‌టిత అధికార ప్ర‌తినిధి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయ‌న మీడియా మిత్రుల‌తో ఇష్టాగోష్టి మాట్లాడుతూ… ఆంధ్రాలో బీసీల గురించి త‌ల‌సాని స్పందించారు. ఆంధ్రాలో బీసీల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌న్నారు.

ఆంధ్రాకి వెళ్లి, అక్క‌డి బీసీల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తా అన్నారు. ర‌మ్మంటూ త‌న‌ను చాలామంది ఆహ్వానిస్తున్నార‌నీ, అక్క‌డి బీసీల‌ను ఏకం చేసేందుకు కావాల్సిన ఆయుధాలు త‌మ ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని త‌ల‌సాని చెప్పారు. చంద్ర‌బాబు హ‌యాంలో బీసీల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌నీ, ఎన్టీఆర్ ఉన్న‌ప్పుడు బీసీల‌కు ప్రాధాన్య‌త ఉండేద‌న్నారు. తెలంగాణ కేసీఆర్ కూడా బీసీల‌కు చాలా చేశార‌న్నారు. తాను గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే ఆంధ్రాలో ఒక్క‌శాతం ఓటర్ల‌నైనా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌న‌నీ, ఏపీకి తాను వ‌స్తేనే టీడీపీ నేత‌లు వ‌ణికిపోతున్నార‌నీ, ఇక రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ వ‌స్తే వాళ్ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ కేసీఆర్ లు క‌ల‌వ‌డం వ‌ల్ల ఆంధ్రాలో వైకాపాకి న‌ష్టం ఏమీ ఉండ‌ద‌ని జోస్యం చెప్పారు త‌ల‌సాని.

కేసీఆర్, జ‌గ‌న్ లు క‌లిస్తే వైకాపాకి న‌ష్ట‌మా లాభ‌మా అనేది వైకాపా చ‌ర్చించుకోవాల్సిన అంశం. దానిపై త‌ల‌సాని విశ్లేషించ‌డం విచిత్రంగా ఉంది. వాస్త‌వానికి, కేటీఆర్ తో జ‌గ‌న్ భేటీ అయిన ద‌గ్గ‌ర్నుంచీ ఏపీలో జ‌ర‌గాల్సిన చ‌ర్చ జ‌రుగుతోంది.ఆంధ్రా రాజ‌కీయాల్లో తెరాస అవ‌స‌ర‌మా అనే చ‌ర్చ ఇప్పుడిప్పుడే మొద‌లౌతోంది. గ‌డ‌చిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ కూడా ఈ త‌ర‌హా ప్ర‌చార‌మే చేశారు క‌దా! తెలంగాణ‌లో ఆంధ్రోళ్ల ఆధిప‌త్యం అవ‌స‌ర‌మా, వారి చేతిల్లోకి పాల‌న వెళ్తిపోతుందంటూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టారు. ఓర‌కంగా, గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో ఏపీలో తెరాసపై ఏర్ప‌డ్డ కొంత సానుకూల అభిప్రాయాన్ని కూడా కేసీఆరే స్వ‌యంగా గ‌త ఎన్నికల ప్రచారంలో చెరిపేశారు. తాత్కాలిక రాజ‌కీయ ల‌బ్ధి కోసం ప్రాంతీయ భావ‌జాలాన్ని వాడుకున్నారు. ఇప్పుడు ఆంధ్రాకి వస్తాం, ఎవ‌రో పిలుస్తున్నారు, ఆయుధాలున్నాయి, బీసీల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తామని త‌ల‌సాని లాంటివారు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డాన్ని ఏమ‌నుకోవాలి..? ఏం, వారికేనా… ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు ఉండ‌దా ఆత్మ‌గౌర‌వం..? తెలంగాణ ఎన్నిక‌ల్లో నేరుగా టీడీపీ పోటీ చేసి విమ‌ర్శ‌లు చేసింది. ఆంధ్రాలో పోటీ చేసే ప‌రిస్థితి తెరాస‌కు లేక‌పోయినా… ఇక్క‌డి రాజ‌కీయాల గురించి ఇష్టం వ‌చ్చినట్టు విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రైందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close