మరో భారతీయ భాషా చిత్రంవిశారణై ఆస్కార్ పోటీలకు అధికార ఎంట్రీగా వెళ్లడం సంతోషమైనా తెలుగు వాళ్లు అందులోనూ గుంటూరీయులు ఒకింత విచారించే విషయం వుంది.తమిళనాడు నుంచి బతుకు తెరువు కోసం నెల్లూరు వచ్చిన యువకులను గుంటూరు పోలీసులు తీవ్రంగా హింసించిన తీరే ఈ కథాంశం. విశారణై అంటే విచారణ.పోలీసు ఇంటరాగేషన్. ప్రముఖ కథానాయకుడు ధనుష్ వెట్రిమారన్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో దినేష్, ఆనంది అచ్చి, కిశోర్ మురుగదాస్ నటించారు. తమిళనాడుకు చెందిన పోలీసు అధికారిగా వచ్చిన సముద్ర ఖని వీరి గురించి తెలుసుకుని ఎలాగో తప్పిస్తాడు.అయితే అక్కడకు వెళ్లాక మళ్లీ తమిళనాడు రాజకీయవేత్తలు వారిని తమ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తారు. ఈ చిత్రంలో పోలీసుల హింసాకాండను చాలా ‘సహజంగా’చూపించారట. ఎంత అంటే చూసి భరించలేనంత. అందుకే మూడు జాతీయ అవార్డులే గాక 2015 వెనిస్ చిత్రోత్సవంలో అంతర్జాతీయ పురస్కారంకూడా పొందింది. ఎం.చంద్రకుమార్ అనే ఆటో డ్రైవర్ రచయితగా రాసిన లాకప్ అన్న నవల ఈ సినిమాకు మూలం.ఈ చిత్రం భారీగా వసూళ్లతో పాటు మంచి పేరు కూడా తెచ్చిపెట్టడం నిర్మాత నటుడు ధనుష్కు ఎంతో సంతోషం కలిగించింది.అన్నట్టు ఎర్ర చందనం స్మగ్లింగ్ వేటలోనూ తమిళ కూలీలను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై సినిమా వున్నట్టుంది. తప్పదు కదా!