వైసీపీ నేతలు ఆహ్వానించారు – టీడీపీ వాళ్లు తీసుకొస్తున్నారు !

నాలుగు కాదు నాలుగు వందల బస్సుల్లో రండి ఏపీలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామని ఏపీ మంత్రులు కేటీఆర్‌కు సవాల్ చేశారు. అయితే ఇప్పుడు ఒక్క తెలంగాణ నుంచే కాదు అన్ని పొరుగు రాష్ట్రాల నుంచి ఇంకా కావాలంటే.. ఆ పొరుగు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నేతల్ని.. ప్రముఖుల్ని తీసుకొచ్చి ఏపీని చూపించాలని నిర్ణయించారు. అయితే ఇలా నిర్ణయించింది వైసీపీ నేతలు కాదు టీడీపీ నేతలు. ఏపీలో పరిస్థితుల్ని.. పాలనను చూడాలంటే టీడీపీ పొరుగు రాష్ట్రాల రాజకీయ నేతల్ని ఆహ్వానిస్తోంది. బుద్దా వెంకన్న బహిరంగా ఆహ్వానం పలికారు కూడా.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమేని టీడీపీ చెబుతోంది. కావాలంటే తాము దగ్గరుండి చూపిస్తామని అంటోంది. ఈ విషయంలో ఒక్క టీడీపీనే కాదు సీపీఐ నారాయణ కూడా అదే మాట అనడం కాదు.. ఆయన నేరుగా వీడియో తీసి చూపించారు కూడా. ఈ క్రమంలో టీడీపీ నేతలు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో రోడ్ల దుస్థితిని .. పాలనా వైఫల్యాన్ని .. ఇతర ప్రభుత్వ విధానాల్లోని లోపాలను మరింత ప్రభావవంతంగా బయట పెట్టాలని వైసీపీ నేతలు ఇచ్చిన ఆహ్వానాన్నే ఇందుకు ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పొరుగు రాష్ట్రాల నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అలాంటి వారిని ఏపీకి తీసుకొచ్చి చర్చ పెట్టడమో.. మరో రకంగా సమస్యల్ని హైలెట్ చేయడమో పెద్ద విషయం కాదు. ఈ దిశగా కూడా టీడీపీ ఆలోచన చేస్తోందని.. బుద్దా వెంకన్న ప్రకటనతోనే తేలిపోయింది. టీడీపీ ఈ వ్యూహం పాటిస్తే రాజకీయంగా వైసీపీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్లే వచ్చి చూడాలని సవాల్ చేశారు కాబట్టి… టీడీపీ వాళ్లు తీసుకొచ్చి చూపించాలని డిసైడయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close