ఆ బాలిక భవిష్యత్‌కు అండగా టీడీపీ..!

రాజమండ్రిలో సామూహిక అత్యాచానికి గురైన బాలికకు అండగా ఉండాలని.. పార్టీ తరపున ఆమెను దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. బాగా చదివించి ఆమెకు ఓ దారి చూపించాలని.. భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం… దళిత బాలికను కొంత మంది సామూహికంగా నాలుగు రోజుల పాటు అత్యాచారం చేసి.. పోలీస్ స్టేషన్ ముందు విడిచి పెట్టారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. టీడీపీ నేతలు.. నిజనిర్ధారణ బృందంగా ఏర్పడి.. జరిగిన ఘటనపై పూర్తి సమాచారాన్ని చంద్రబాబుకు నివేదిక రూపంలో ఇచ్చారు.

ఆ బాలిక పదో తరగతి చదువుకుందని తెలియడంతో.. పార్టీ తరపున దత్తత తీసుకుని ఆమెను చదివించాలని నిర్ణయించారు. అలాగే రూ. రెండు లక్షల ఆర్థిక సాయాన్ని కూడా పార్టీ తరపున అందించాలని నేతలను ఆదేశించారు. బాధితురాలిలో ఆత్మవిశ్వాసం కలిగించాలని ఇటువంటి దుర్మార్గాలపై పోరాడే యోధురాలిలా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందని చంద్రబాబు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ఆర్థికంగా వెనుకబడిన పార్టీ కార్యకర్తల పిల్లలను చదివిస్తూ ఉంటుంది. హైదరాబాద్ గండిపేటలో స్కూల్ , కాలేజీలు కూడా ఉన్నాయి. అక్కడ ఆ బాలికను చదివించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో దళిత వర్గంపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఎక్కువగా ఈ ఘటనల్లో పోలీసులే నిందితులుగా తేలుతున్నారు. రాజమండ్రి బాలిక విషయంలో… పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించగా.. యువకుడి శిరోముండనం ఘటనలో… పోలీసులే నిందితులయ్యారు. వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. చీరాలలో పోలీసులే మాస్క్ పెట్టుకోలేదని.. దళిత యువకుడ్ని కొట్టడంతో చనిపోయారు. అన్నీ వరుసగా దళితులపైనే దమనకాండ జరుగుతూండటంతో… అణిచి వేయడానికే ఇలా చేస్తున్నారని.. దళిత సంఘాలు.. విపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close