చంద్రబాబుకి గుడి, తెదేపా మౌనం?

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తుళ్ళూరు మండలం హరిశ్చంద్రపురం వద్ద పుష్కర్ ఘాట్ సమీపంలో గుడి కట్టేందుకు తెదేపా మండల అధ్యక్షుడు బుడ్డి సతీష్ సిద్దం అవుతున్నారు. ఆయనకి ఒక స్థానిక రైతు సహకరిస్తున్నాడు. ఈ వార్త అన్ని మీడియా చానళ్ళలో వచ్చింది. కానీ దీనిపై చంద్రబాబు నాయుడు కానీ తెదేపా మంత్రులు నేతలుగానీ స్పందించకపోవడం విశేషం.

రైతులు అందరూ స్వచ్చందంగా తమ భూములను ఇచ్చారని అందుకే 33, 000 ఎకరాలను సేకరించగలిగామని చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, తెదేపా నేతలు గొప్పగా చెప్పుకొనేవారు. కానీ భూసేకరణలో రైతుల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. ఆ కారణంగా చంద్రబాబు నాయుడు రైతులతో సహా అన్ని వర్గాల ప్రజల నుండి చాలా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. రైతుల దగ్గర నుండి బలవంతంగా భూములు లాక్కొంటే సహించబోమని జగన్, పవన్ కళ్యాణ్ వంటివారు గట్టిగా హెచ్చరించిన తరువాతే ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను నిలిపివేసింది. అంటే రైతుల అభీష్టానికి విరుద్దంగా బలవంతంగా వారి భూములను స్వాధీనం చేసుకొన్నట్లు లేదా అటువంటి ప్రయత్నాలు చేసినట్లు స్పష్టం అయ్యింది.

చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే రైతు వ్యతిరేకి అనే బలమయిన ముద్ర ఒకటి పడిపోయింది. రాజధాని మొదలు బందరు, గన్నవరం, భోగాపురం వరకు భూసేకరణ చేస్తుండటంతో చంద్రబాబు నాయుడు పట్ల రైతులలో వ్యతిరేకత పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన రైతుల పాలిట దేవుడు అనే విధంగా పార్టీ నేత ఒకరు గుడి కడుతుంటే అభ్యంతరం చెప్పడం కంటే మౌనం వహించడమే మేలు. దాని వలన చంద్రబాబు నాయుడుకి కొంత పాజిటివ్ పబ్లిసిటీ వస్తుంది. బహుశః అందుకే మౌనం వహిస్తున్నారేమో. కానీ బ్రతికున్న మనుషులకు గుళ్ళు గోపురాలు, శిలావిగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అమంగళం అనే సంగతి ఆయనకి తెలియకపోదు. కనుక ఆఖరు నిమిషంలో కలుగజేసుకొని గుడి కట్టే ప్రతిపాదనను నిలిపి వేయిస్తారేమో? అయినా ఇటువంటి పనులతో మనుషులకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉన్నట్లయితే అందరూ అదే పని చేసి ఉండేవారు కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close