జగన్‌తో “టచ్‌”లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలెవరు..?

ఇరవై మంది టీడీపీ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారని అప్పట్లో రాజ్ భవన్ ముందు…చేసిన చాలెంజ్‌ను.. మరోసారి అసెంబ్లీలో గుర్తుకు వచ్చేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనతో ఎంతమంది టచ్ లో ఉన్నారో చెప్పమంటారా అంటూ అసెంబ్లీలో వేలు చూపిస్తూ.. చేసిన వ్యాఖ్యలు.. అటు శాసనసభలో, ఇటు లాబీల్లో తీవ్ర కలకలం రేకెత్తించాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా జగన్ వ్యాఖ్యలను సభలోనే ఎద్దేవా చేశారు. అయితే.. అంతర్గతంగా మాత్రం.. కలకలం రేపింది.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. ఆరు నుంచి ఏడుగురు వైసీపీలోకి వెళ్తారని కూడా వారి పేర్లతో సహా సోషల్ మీడియా కోడై కూసింది. అప్పట్లో ఈ ప్రచారం జరిగినప్పటికీ, ఆ తర్వాత నిలిచిపోయింది. ఎవరైన తమ పార్టీలో చేరాలంటే వారు రాజీనామా చేయాల్సిందేనని, తిరిగి ఎన్నికైన తర్వాతనే పార్టీలోకి తీసుకుంటానని జగన్ స్పష్టం చేయడంతో వీరు ఆగిపోయారని కూడా అప్పట్లో చెప్పుకున్నారు. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే అసెంబ్లీలో జగన్ తాను ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించనని… వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు. ఎవరైనా తమ పార్టీలోకి రావాలన్నా, తాము తీసుకోవాలన్నా వారు ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు.

ఆ తర్వాత లాబీల్లో దీనిపై చర్చ జరిగింది. ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తామని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది అసెంబ్లీ లాబీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం తెలుగుదేశం ఎమ్మెల్యేల వరకు వెళ్లింది. వారు మమ్మల్ని బద్నామ్ చేసేందుకు ఇటువంటి ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకుంటే, తాము వెళ్లి అక్కడ ఏం చేస్తామని కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఇలా అసెంబ్లీ లాబీల్లో తెలుగుదేశం, వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు మీడియా వద్ద విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close