రూల్ నెం 71.. ఇదీ మండలిలో టీడీపీ పాచిక..!

మూడు రాజధానుల నిర్ణయాన్ని తిరస్కరించడానికి.. తెలుగుదేశం పార్టీ అనూహ్యమైన మార్గన్ని శానసమండలిలో ఎంచుకుంది. టీడీపీ ఊహించని స్టెప్ వేయడంతో.. అవాక్కయిన అధికారపక్షం.. వెంటనే.. శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయించింది. టీడీపీ వేసిన ప్లాన్ రూల్ నెం 71. మండలి ప్రారంభం కాగానే.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. అప్పుడే.. టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు రూల్ నెం 71 ప్రకారం తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించే అవకాశం రూల్ నెంబర్ 71వల్ల కలుగుతుంది. మండలిలో మెజార్టీ ఉంటే.. రూల్ నెంబర్ 71కింద తీర్మానం ప్రవేశ పెట్టవచ్చని తేలింది. వెంటనే.. మెజార్టీని శాసనమండలి లెక్కించడంతో తీర్మానం ప్రవేశపెట్టేందుకు బలం ఉందని నిర్ధారణ అయింది.

రూల్‌ 71కు మద్దతుగా 30 మంది ఎమ్మెల్సీలు నిలబడ్డారు. తీర్మానంపై చర్చను ఆమోదిస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించినట్టే అవుతుంది. టీడీపీ ఈ రూట్‌లో వస్తుందని అంచనా వేయలేకపోయిన అధికారపక్షం.. తత్తరపాటుకు గురైంది. ఈ రూల్ కింద.. తీర్మానం పెట్టే అధికారం లేదని.. బుగ్గన వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మండలి ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే.. సాంకేతిక కారణాల వల్లే ప్రసారాలు నిలిచిపోయాయని.. ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ప్రభుత్వం అభ్యంతరం తెలిపినప్పటికీ.. రూల్ నెంబర్ 71 కింద… మండలి చైర్మన్ చర్చకు అనుమతించారు. ప్రభుత్వ తీరుపై యనమల ఓ సందర్భంలో మండిపడ్డారు.

తమ ఎమ్మెల్సీలకు.. వైసీపీ నేతలు ఫోన్లు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. శాసనమండలిలో.. వికేంద్రీకరణ బిల్లును తిరస్కరిస్తారన్న నమ్మకం ఉండటంతో.. ఎలాగోలా గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి శాసనమండలి వీఐపీ గ్యాలరీ నుంచి సమావేశాలను పరిశీలిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close