‘దేశం’లో ఇక అధికార పదవుల పంపిణీ!

వేర్వేరు స్ధాయిల్లో నామినేటెడ్ పదవులకు అర్హులైన వారి పేర్లను, అర్హతలను, పార్టీకి ప్రజలకు చేసిన సేవల వివరాలను జులై ఆఖరులోగా ఇవ్వాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలను, జిల్లా ఇన్ చార్జ్ లను పార్టీ ఆదేశించింది.

నియోజకవర్గాల సంఖ్య పెంచడం వీలుపడదని రాజ్యసభలో ప్రభుత్వం ప్రకటించడంతో పదవులు ఆశిస్తున్న తెలుగుదేశం పాత, కొత్త నాయకుల్లో వత్తిడి పెరిగింది.

దీనికి తోడు తెలుగుదేశం పార్టీ గత నెలలో నిర్వహించిన సర్వే ప్రకారం 45 శాసనసభా నియోజకవర్గాల్లో పార్టీకి పాస్ మార్కులు కూడా రాలేదని, 30 నియోజకవర్గాల్లో పాస్ మార్కులు మాత్రమే వచ్చాయని చంద్రబాబు నాయుడు పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో చెప్పారు. అయితే ఆ నియోజకవర్గాల పేర్లను మాత్రం వెల్లడించలేదని కమిటీ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

మరోవైపు ”గడపగడపకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో కూడా రాష్ట్రప్రభుత్వం పని తీరు తెన్నులపట్ల పెరుగుతున్న వ్యతిరేకత బయటపడుతోంది.

ఏ ఒక్కనియోజకవర్గంలోకూడా తెలుగుదేశం వెనుకబడి వుండకూడదన్నది చంద్రబాబు లక్ష్యం. దీన్ని సాధించణానికి నామినేటెడ్ పదవుల్లో నాయకులను నియమించి వారిద్వారా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు.

ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు పంపే ప్రతిపాదనలను పార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఫిల్టర్ చేసి, ప్రాధాన్యతా క్రమంలో జాబితాలు రూపొందిస్తారు. రకరకాల సమీకరణలను బేరీజువేసి నియామకాలపై చంద్రబాబు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close