ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత టార్గెట్‌గా రంగంలోకి వర్ల..!

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని .. తెలుగుదేశం పార్టీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థిగా వర్ల రామయ్యను చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరగడం కోసమే .. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించామని చంద్రబాబు ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో మా ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేస్తామని.. పార్టీ ఏజెంట్‌కు చూపి ఓటేయాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విప్‌ ఉల్లంఘిస్తే అనర్హతకు గురవుతారని తేల్చి చెప్పారు. ప్రభుత్వం చేసేది తప్పని భావిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు..వర్లకు ఓటేయాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఎలాంటి పిలుపునిచ్చినా… చంద్రబాబు వ్యూహం మాత్రం.. రెండు స్థానాలకు ఉపఎన్నికలు తీసుకు రావాలనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు లభించాయి. కానీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి… వైసీపీ ఆకర్ష్ లో పడిపోయారు. ఆ పార్టీలో చేరలేదు. పార్టీ ఫిరాయిస్తే.. అనర్హతా వేటు వేస్తామని గంభీరమైన ప్రకటనలు గతంలో వైసీపీ అధినాయకత్వం చేసి ఉండటంతో ప్రత్యేక సభ్యులుగా గుర్తించి.. ప్రస్తుతానికి పార్టీలో చేర్చుకోలేదు. వీరు సాంకేతికంగా టీడీపీ గుర్తుపై గెలిచారు కాబట్టి.. టీడీపీ సభ్యులే. విప్ ను ధిక్కరిస్తే.. అనర్హతా వేటుకు గురవుతారు.

అందుకే శాసనమండలిని రద్దు చేస్తూ.. అసెంబ్లీ చేసిన తీర్మానంలో ఓటింగ్ కు కూడా వీరు హాజరు కాలేదు. ఇప్పుడు వీరిని ఫిక్స్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి రాజ్యసభ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు. 175 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి కాబట్టి.. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 44 మంది కావాలి. టీడీపీ ఎలాంటి అవకాశం లేదు. కేవలం విప్ జారీ చేసి.. రెండు చోట్ల ఉపఎన్నికలు తేవాలన్న లక్ష్యంతోనే పోటీ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close