తెలంగాణా ప్రాజెక్టులని తెదేపా నేతలే చేస్తున్నారు: వైకాపా

తెలంగాణాలో పాలమూరు ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి చెందిన సంస్థ చేస్తోందని రేవంత్ రెడ్డి తదితర తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలను పెద్దిరెడ్డి ఖండించడమే కాకుండా, ఆ ప్రాజెక్టులను ఒక ప్రముఖ తెదేపా నేతకి చెందిన నవయుగ కంపెనీయే చేస్తోందని ఆరోపించారు. తమ సంస్థలు దేశ,విదేశాలలో పనులు చేస్తున్న మాట వాస్తవమే కానీ తెలంగాణాలో మాత్రం ఒక్క పని కూడా చేపట్టలేదని పెద్దిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నవయుగ సంస్థకి చెందిన హెలికాఫ్టర్లో తిరగడం అందరికీ తెలుసని పెద్దిరెడ్డి అన్నారు. తెదేపా నేతకి చెందిన ఆ సంస్థకి తెలంగాణా ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కినందునే తెదేపా నేతలు ఎవరూ వాటిని గట్టిగా వ్యతిరేకించడం లేదేమో? అని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తమ సంస్థలు వ్యాపారాలు చేసి డబ్బు సంపాదిస్తుంది తప్ప తెదేపా నేతల్లాగా రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించదని ఆయన తెదేపా నేతలకు చురకలు వేశారు. తమ సంస్థ చంద్రబాబు నాయుడు స్వంత నియోజక వర్గంలో కూడా రోడ్ల నిర్మాణ పనులు చేస్తోందని, ఆ విషయం ఆయనకీ తెలుసని అన్నారు.

మిథున్ రెడ్డి సంస్థకు తెలంగాణా ప్రభుత్వం రూ.6000 కోట్ల విలువగల పనులు అప్పగించిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటే, తమ సంస్థలు అసలు తెలంగాణాలో ఏ పనులు చేపట్టలేదని పెద్దిరెడ్డి చెపుతున్నారు. ఎవరిమాట నిజమో తేల్చి చెప్పగల తెరాస ప్రభుత్వం వారి వాదోపవాదాలలో తలదూర్చకపోవడం విశేషమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close