తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ !

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా సైడ్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. . ఈ అసహనం బండి సంజయ్ లో కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పకడ్బందీగా పార్టీని ముందుకు తీసుకెళ్తూంటే బండి సంజయ్ కు బీజేపీని నడపడం సాధ్యం కావడం లేదని వస్తున్న విమర్శలపై ఆయన స్పందించిన తీరు చూసిన వారికి.. బీజేపీకి భవిష్యత్ లేదని ఆయనకూ అర్థమైపోయిందని అనుకుంటారు. తనకు రేవంత్ రెడ్డిలా ఓటర్లను కొనడం రాదని.. చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతే కాదు తన హయాంలో గెలిచినవన్నీ ఏకరువు పెట్టి.. రేవంత్ రెడ్డే వరుసగా పార్టని గెలిపించలేకుండా వస్తున్నారని.. ఎవరు గొప్ప అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నల వెనుకే.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి గడ్డుగా మారిందని సులువుగా అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఒక్క సారిగా తిరగబడింది. పార్టీ లోకి వచ్చే వారు కాకుండా పోయేవారిపై చర్చ జరుగుతోంది. మరో వైపు కవిత విషయంలో దర్యాప్తు సంస్థల తీరు .. ఆ రెండు పార్టీలు ఒకటే అనుకునేలా చేశాయి. ఇదే అదనుగా బీజేపీలో ఉక్కపోతుకు గురవుతున్న నేతల విషయంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. బీజేపీలో చేరిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరగడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు.

రేవంత్ రెడ్డి టార్గెట్ బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కు ముఖాముఖి పోరు జరిగేలా చూసుకోవడం . బీజేపీ అసలు రేసులో లేదన్న అభిప్రాయాన్ని కల్పించడం. ఇందు కోసం రేవంత్ అన్ని రకాల ప్లాన్లూ వేస్తున్నారు. ముఖాముఖి పోరు అంటూ జరిగితే అది కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కన్సాలిడేట్ అయితే అధికార పార్టీకి ఇబ్బందే. బీజేపీ బలంగా ఉండి ఉంటే మూడు పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ విజయం సునాయాసం అవుతుంది. కానీ ఇప్పుడు ముఖాముఖి పోరు కోసం .. కర్ణాటక విజయం ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఆ దిశగానే వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close