కరోనాపై ఏం చేయాలో కేసీఆర్ సర్కార్‌కు చెప్పిన హైకోర్టు..!

కరోనా విషయంలో నిర్లిప్తంగా ఉందని విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశాలు జారీచేసింది. కరోనాకు సంబంధించిన కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని.. జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కరోనా కేసులు వెల్లడించాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ర్యాపిడ్‌ యాంటీజెంట్‌ టెస్ట్‌ నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సూచించిందని హైకోర్టు గుర్తుచేసింది. ఐసీఎంఆర్‌ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని… స్పష్టం చేసింది. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే కాదని.. మరో 54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు అందిస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

అయితే.. గాంధీతో పాటు 54 ఆస్పత్రుల్లో.. కరోనా చికిత్సలు జరుగుతున్నాయని ప్రచారం చేయాలని సూచించింది. సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో ప్రభుత్వం చెప్పాలని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితోపాటు పోలీసులకు రక్షణ కిట్లు ఇవ్వాలని.. సిబ్బందికి షిఫ్ట్‌ల విధానం అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈనెల 29లోగా నివేదిక సమర్పించాలని ఆర్డర్స్ పాస్ చేసింది. పెద్దఎత్తున వైద్య సిబ్బంది, పోలీసులు కరోనా వైరస్ బారిన పడ్డారు. అలాగే.. టెస్టులు సరిగ్గా చేయడం లేదన్న విమర్శలు ఎదురవుతున్నాయి.

వీటన్నింటి కారణంగా హైకోర్టు.. ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తూ..స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు మృతదేహాలకు కూడా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అలా చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకు వచ్చింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తుందో.. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తుందో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close