మేమే నెంబర్ వన్ !

తెలంగాణ రాష్ట్రం ప్రజా సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. ఆసరా పెన్షన్ల నుంచి రైతు రుణమాఫీ వరకూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బేగంపేటలోని అధికార నివాసంలో జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రజల సంక్షేమం కోసం ఎంతెంత ఖర్చు పెడుతోందోలెక్కలు చెప్పారు. 30 వేల కోట్ల రూపాయలకు పైగా సంక్షేమంపై ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తమదేనని చెప్పారు.

సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి కల్పనకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా కొత్త పరిశ్రమలను తెలంగాణకు రప్పిస్తున్నట్టు తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పుకోసం తపించే ప్రభుత్వం తమదని చెప్పుకున్నారు. పలు అంశాల్లో ప్రజాహితంగా ఎలా మసలుకోవాలో ఆయన కలెక్టర్లకు హితబోధ చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పరిచామని, గుడుంబాను అరికట్టామని వివరించారు. జిల్లాల్లో అత్యవసర పరిస్థితుల్లో నిధులకోసం కలెక్టర్లు తడుముకునే పరిస్థితి ఉండొద్దన్నారు. అందుకోసం ప్రతి జిల్లాకు 3 కోట్ల రూపాయలను మంజూరు చేస్తామన్నారు. అనడమే కాదు, ఈ మేరకు రూ. 93 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

జిల్లాల సంఖ్య పెరిగిన తర్వాత మొదటిసారిగా కలెక్టర్లతోఆయన సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వివిధ అంశాలపై తమకు మార్గదర్శనం చేశారని కొందరు కలెక్టర్లు మీడియాకు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close