తెలంగాణ విపక్ష నేతలందరిదీ పాదయాత్ర వ్యూహమే..!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలకు పాదయాత్రలు సక్సెస్‌కు దగ్గరి దారిగా కనిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి సిరీస్‌లో తాజాగా.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. టీఆర్ఎస్‌కు మరోసారి ప్రజులు ఓట్లు వేయరన్న గట్టి నమ్మకంతో ఉన్న ప్రతిపక్ష పార్టీలు.. ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు.., ప్రయత్నిస్తున్నారు. ఏ పార్టీకి బలమైన నేత ఉంటే.. ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ బలాన్ని నేతలు పెంచుకునేందుకు పాదయాత్ర బాట పడుతున్నారు.

తెలంగాణలో దూకుడు మీద ఉన్న భారతీయ జనతా పార్టీ … ఇప్పుడు కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కొత్తగా బాధ్యతలు తీసుకుని బీజేపీకి ఎప్పుడూ లేనంత ఊపు తీసుకొచ్చి పెట్టిన బండి సంజయ్… మొదట బస్సు యాత్ర చేయబోతున్నారు. నియోజకవర్గాలు అన్ని తిరిగిన తర్వాత.. ఆయన పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి.. ఢిల్లీలోనే ప్రణాళిక సిద్ధమవుతోందని అంటున్నారు. జమిలీ ఎన్నికల చాన్స్ ను బట్టి.. బండి సంజయ్ పాదయాత్ర తేదీలు కూడా ఖరారయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా ఎన్నికల వేడి ప్రారంభమయ్యే నాటికి పాదయాత్ర.. ప్రజల్లో చర్చనీయాంశంగా ఉండాలని బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది.

ఇక కాంగ్రెస్ నేతలదీ కూడా పాదయాత్ర ఆలోచనే. టీ పీసీసీ అధ్యక్షుడ్ని వారంలో ప్రకటించనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేదా రేవంత్ రెడ్డి ఎవరు పీసీసీ చీఫ్ అయినప్పటికీ.. వారి ప్రథమ ప్రాధాన్యం పాదయాత్రమే. రేవంత్ రెడ్డి తన ప్రణాళికల్ని పార్టీ హైకమాండ్‌కు సమర్పించారు. తాను పార్టీకి పునర్‌వైభవం ఎలా తెస్తారనో నివేదిక సమర్పించారు. అందులో పాదయాత్ర కీలకం. అలాగే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి… పీసీసీ చీఫ్ పోస్ట్ ఇస్తే పాదయాత్ర చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అంటే ఇద్దరి ప్లాన్లు పాదయాత్రనే. పాదయాత్ర ద్వారా ప్రజల్ని ఆకట్టుకుని..తమ బలాన్ని పెంచుకోవడంతో పాటు.. ప్రజల్ని ఆకట్టుకోవచ్చని నమ్ముతున్నారు. పరిస్థితి చూస్తూంటే తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో… ప్రతిపక్ష పార్టీల నేతల పాదయాత్రలు చేయడం కామన్‌గా మారేలా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close