బిజెపి శరణం మమ అంటున్న టిటిడిపి?

తెలంగాణలో టిడిపి నాయకుల పరిస్థితి దారుణంగా వుందంటున్నారు. వారికి అద్యక్షుడు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఎలాటి సహాయ సహకారాలు గాని సమయం గాని లభించడం లేదు.పోనీ మాకు స్వేచ్చ ఇవ్వండి అంటే అదీ లేదట. ఆర్థిక సహాయం లేక వ్యూహపరమైన సూచనలు లేక అనాసక్త నాయకత్వం ధోరణికి టిటిడిపి నేతలు ఆవేదనకు గురవుతున్నారు. టిఆర్‌ఎస్‌లో కలసిపోయిన వారు, రేవంత్‌ రెడ్డిలా దూకుడుగా వున్నవారు మినహా తక్కిన సీనియర్‌ సిన్సియర్‌ నేతలు బుర్ర పగలగొట్టుకుంటున్నారు. బిజెపి నేతలు తెలంగాణలో టిడిపితో పొత్తు వుండదని చెప్పేశారు. కాంగ్రెస్‌లో కలిసే అవకాశం వుండదు గనక టిఆర్‌ఎస్‌ను తిట్టితిట్టి వెళ్లలేము గనక ఎన్‌డిఎ ముసుగులో బిజెపి పేరిట పోటీ చేసే అవకాశమైనా ఇవ్వాలని టిటిడిపి నేతలు అడుగుతున్నారు.దానికి ఒప్పేసుకుంటే తెలంగాణలో వున్న టిడిపి యంత్రాంగం మొత్తం బిజెపికి సంక్రమిస్తుంది. అయితే చంద్రబాబు నోరు తెరిచిచెప్పకపోయినా సంకేతాలు అటే వున్నాయని కొందరు సీనియర్లు అంటున్నారు. కేంద్రంలోనైనా అధికారం వుంది గనక బిజెపితో వెళితే లాభపడతామన్న ఆలోచన వారికి వుంది. బిజెపి కూడా వారిపై బాగానే ఎరవేస్తున్నట్టు కనిపిస్తుంది. చివరకు అదే జరగొచ్చు. ముఖ్యమంత్రిగా ఎవరు ప్రకటిస్తే ఆ పార్టీలో వెళ్లాలనుకుంటున్న రేవంత్‌కు మాత్రం ఆ ఆహ్వానం ఎవరినుంచి రావడం జరిగేపని కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్ర‌మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్… బీజేపీ అగ్రనేత జోస్యం!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా...? మ‌ల్కాజ్ గిరి దీవించి పంపితే జ‌రిగేది అదే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర‌మంత్రి. మల్కాజ్ గిరిలో ఈట‌ల గెలిస్తే కేంద్ర‌మంత్రి అవుతారు అంటూ...

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close