మళ్ళీ విధులలో చేరనున్న న్యాయాధికారులు

తెలంగాణా న్యాయమూర్తుల సంఘం హైదరాబాద్ లో నిన్న సమావేశమయ్యి రెండు తీర్మానాలు ఆమోదించింది. తమ సంఘం తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి వ్యవహరించినందుకు 11మంది న్యాయమూర్తులపై హైకోర్టు సస్పెన్షన్ విదించినందుకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక తీర్మానం ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. టాకూర్ అభ్యర్ధనని గౌరవిస్తూ న్యాయమూర్తులు అందరూ తక్షణమే తమ శలవులని రద్దు చేసుకొని మళ్ళీ విధులకి హాజరవ్వాలని మరొక తీర్మానం చేశారు.

భారత ప్రధాన న్యాయమూర్తి మాటకి గౌరవమిచ్చి మళ్ళీ విధులలో చేరాలని తెలంగాణా న్యాయమూర్తులు నిర్ణయించుకోవడం చాలా మంచి నిర్ణయం. అభినందనీయం. కానీ తెలంగాణా న్యాయవాదులు ఇంకా సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. తమ సమస్యల పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామని చెపుతున్నారు. అది సరికాదు. సాక్షాత్ భారత ప్రధాన న్యాయమూర్తి వారిని అభ్యర్ధించినపుడు, వారి సమస్యలని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నప్పుడు కూడా వారు ఇంకా సమ్మె కొనసాగిస్తే వారు తమ సమస్యల పరిష్కారం కోసమే సమ్మె చేస్తున్నారా లేదా రాజకీయ నేతలు ప్రేరేపించుతున్నందునే సమ్మె చేస్తున్నారా? అనే అనుమానాలు కలగడం సహజం. కనుక వారు కూడా జస్టిస్ టి.ఎస్. టాకూర్ మాటకి గౌరవమిచ్చి తక్షణమే సమ్మె విరమించి విధులలో చేరినట్లయితే వారికీ గౌరవంగా ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తికి గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది. అప్పుడు వారి సమస్యలని పరిష్కరించవలసిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుంది కనుక తప్పకుండా ఆయన వాటి పరిష్కారం కోసం చొరవ తీసుకొంటారు. అలాకాదని ఇంకా సమ్మె కొనసాగిస్తే, వారి సమస్యల పరిష్కారం కావడం ఇంకా ఆలస్యం అవుతుంది. న్యాయస్థానాన్ని ధిక్కరించినందుకు కటినమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని న్యాయవాదులైన వారికి తెలియకపోదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close