టి.జి. వెంకటేష్, ఏరాసు వైకాపాలో చేరే అవకాశం?

కర్నూలుకి చెందిన మాజీ మంత్రులు టి.జి. వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇద్దరూ 2014 ఎన్నికలకు ముందు తెదేపాలో చేరి పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి వారిద్దరినీ పార్టీలో పట్టించుకొనేవారే లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటించినప్పుడు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేయరు. కనుక జిల్లాకి చెందిన వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలో చేర్చుకొనేటప్పుడు వారిని ముఖ్యమంత్రి సంప్రదిస్తారనుకొంటే అది అత్యాశే అవుతుంది. 2014 ఎన్నికలలో తాము ఎవరి చేతుల్లో ఓడిపోయామో వారినే తమకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా పార్టీలో చేర్చుకోవడంతో వారిరువురూ తెదేపా అధిష్టానంపై ఆగ్రహంగా ఉండటం సహజమే. ఒకప్పుడు కాంగ్రెస్ హయంలో మంత్రులుగా చక్రం తిప్పిన వారికి ఈ పరిస్థితి ఎదురవడం జీర్ణించుకోవడం కష్టమే. అందుకే వారిరువురూ వైకాపా వైపు చూస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యనే జిల్లాలోని కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణ వైకాపాలో చేరారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కారణంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఆందోళన చెందుతున్నారు. కనుక ఇటువంటి పరిస్థితులో వైకాపాలో చేరి ఆయనకి అండగా నిలబడితే, వైకాపాలో మంచి గుర్తింపు పొందవచ్చని వారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే అధికార పార్టీని వీడి నానాటికీ బలహీనపడుతున్న ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళడం మంచిదా కాదా అనే సందిగ్ధంలో ఉన్నందున నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close