తోట త్రిమూర్తులు ఇక టీడీపీకి లేనట్లే..!

ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడిన కార్యకర్తలకు ధైర్యం చెప్పడం కోసం.. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. తొలి విడతగా.. ఆయన తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ టూర్ లో ఓటమి ప్రభావం… టీడీపీ అధినేతకు స్పష్టంగా కనిపించింది.కొంత మంది కీలక నేతలు… సమావేశానికి హాజరు కాలేదు. ముఖ్యంగా.. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమావేశానికి హాజరు కాలేదు. టీడీపీ తరపున పోటీ చేసిన వరుపుల రాజా అనే నేత కొద్ది రోజుల కిందటే పార్టీకి రాజీనామా చేయడంతో.. ఆయన కూడా రాలేదు. తోట త్రిమూర్తులు.. ఓటమి పాలైనప్పటి నుంచి పార్టీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. కొన్నాళ్ల కిందట కాపు నేతలందర్నీ సమీకరించి ఆయన సమావేశం నిర్వహించడం కలకలం రేపింది.

అయితే..తాను టీడీపీలోనే ఉంటానని చెబుతున్నప్పటికీ… పార్టీ వ్యవహారాల్లో మాత్రం పాలు పంచుకోవడం లేదు. ఆయన అటు బీజేపీతోనూ.. ఇటు వైసీపీతోనూ చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. స్వయంగా టీడీపీ అధినేత జిల్లాకు వచ్చినప్పటికీ… ఆయనను కలిసేందుకు..సమీక్షా సమావేశానికి వచ్చేందుకు తోట త్రిమూర్తులు నిరాకరించారు. త్రిమూర్తులు వద్దకు రెడ్డి సుబ్రమణ్యంను చంద్రబాబు పంపారు. అయినప్పటికీ.. త్రిమూర్తులు వచ్చేందుకు నిరాకరించారు. తనకు పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని.. కొంత మంది నేతలపై ఫిర్యాదు చేసి పంపించారు. యనమల, చినరాజప్ప తీరుపై త్రిమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తనను ఇబ్బంది పెడుతున్నారని.. పార్టీకి నష్టం చేస్తున్నారని.. రెడ్డి సుబ్రమణ్యంతో చెప్పి పంపించారు తోట త్రిమూర్తులు. అయితే త్రిమూర్తులపై గతంలో ఉన్న కేసులు… ఇతర వ్యాపార వ్యవహారాల కారణంగా.. ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని.. అందుకే… టీడీపీకి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. రాజమండ్రి లోక్ సభ నుంచి పోటీ చేసిన మాగంటి రూప, కాకినాడ లోక్ సభకు పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ కూడా… సమావేశాలకు రాలేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు.. ఓటమి భారం… టీడీపీ సమావేశంలో స్పష్టంగా కనిపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close