మచిలీపట్నంలో తేలిన అగ్రనిర్మాతలు

ఏపీ ప్రభుత‌్వంతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకోడానికి అగ్రనేతలు హుటాహుటిన మచిలీపట్నం చేరుకున్నారు. వివాదం అంతకంతూ పెరిగిపోతూండటంతో అటు ఏపీ ప్రభుత్వం.. ఇటు నిర్మాతల మధ్య కొంతమంది ప్రముఖులు మధ్యవర్తిత్వం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని కూడా అంగీకరించడంతో నిర్మాతలు మచిలీపట్నం వెళ్లి పేర్ని నానిని కలిశారు. దిల్ రాజు, నాగవంశీ, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు ఇలా కలిసిన వారిలో ఉన్నారు. వీరందరూ పెద్ద సినిమాలు తీస్తున్న నిర్మాతలే. ప్రభుత్వంతో సామరస్య పరిష్కారం కోసం.. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శల నేపధ్యంలో ఈ వివాదం రాజకీయ అంశమైంది. ఇండస్ట్రీ వర్గాలు ఒక్క తాటిపైకి లేవు. అలాగని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను బహిరంగంగా ఫిల్మ్ చాంబర్ మాత్రమే ఖండించింది. నిర్మాతలు అందరూ సైలెంట్‌గా ఉన్నారు. వైఎస్ఆర్ సీపీకి సన్నిహితంగా ఉండే కొంత మంది మాత్రమే పవన్ కు వ్యతిరేకంగా స్పందించారు. మిగతా వారందరూ ఏపీ ప్రభుత్వం.. ఇండస్ట్రీని వేధిస్తోందన్న అభిప్రాయంలోనే ఉన్నారు.

ఈ క్రమంలో ఈ వివాదం అంతకంతకూ పెరిగిపోవడం వల్ల రెండు వర్గాలకు నష్టం జరుగుతుందని.. పరిష్కరించుకోవడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌కు వీలైనంత వరకూ వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవలే అమరావతిలో పేర్ని నాని నిర్మాతలు కలిశారు. మళ్లీ ఇప్పుడు మచిలీపట్నంలో తేలారు. ఎలాంటి పరిష్కారం వస్తుందో వేచి చూడాలి. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close