టీ పీసీసీకి ఉత్తమ్ శల్య సారధ్యం..! మార్పు లేకుంటే అథోగతే..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చేవ లేకుండా పోయింది. టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పని తీరు.. సొంత పార్టీ నేతల్ని కూడా…నిరాశకు గురి చేస్తోంది. తన వర్గం అనుకున్న వారంతా.. తనను పొగిడి.. అదే నోటితో టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నామని చెబుతున్నారు. తన వ్యతిరేక వర్గం అనుకున్న వారు కూడా.. ఉత్తమ్‌ది అసమర్థ నాయకత్వం అని తిట్టి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో రెండు వైపులా.. ఉత్తమే బ్యాడ్ అయిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పీసీసీ నుంచి వైదొగలడమే ఉత్తమం అని ఉత్తమ్ ఆలోచనకు వచ్చినట్లు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

టీ పీసీసీది గాలివాటం రాజకీయం..!

తెలంగాణలో ప్రతిపక్షంగా ఉందా.. లేదా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర నాయకత్వం .. నిష్క్రియాపరత్వం కారణంగా.. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది జంపయిపోయారు. ఇక మిగిలినవారులో.. ముగ్గురు, నలుగురు.. పిలుపుచొచ్చాయని.. పిలుపులొస్తున్నాయని.. పిలుస్తారేమోనని.. ఎదురు చూస్తున్నారు. దీనికంతటికి కారణంగా.. పీసీసీ రాష్ట్ర నాయకత్వమే. ఒక్క ఎమ్మెల్యేకూ… నమ్మకం కలిగించలేకపోవడంతో… ఈ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలోనే … టీఆర్ఎస్ పెద్దలతో కుమ్మక్కయ్యారన్న ప్రచారం దగ్గర్నుంచి… నేటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ.. ఏ ఒక్క పనిని వ్యూహాత్మకంగా చేయడం లేదు. దాంతో… ఉత్తమ్ పై.. రాహుల్ గాంధీ కూడా నమ్మకం కోల్పోయారు.

తీసేయడం కంటే వైదొలిగితే ఉత్తమ్ గౌరవం నిలబడుతుందా..?

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై బాధ్యత తీసుకోవాలంటూ… ఉత్తమ్ పై అనుచరులు అనుకున్నవారే మండిపడుతూండటంతో ఆయన హర్టయ్యారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను సైతం తన అసమర్థతగానే అంటూ జరుగుతోన్న ప్రచారం మీద కూడా కెప్టెన్ ఆవేదన చెందుతున్నారట. ప్రతిపక్షంలో ఉండి పార్టీ నిర్వహణ ఎంతో భారమైనా..అన్ని వ్యయప్రయాసలకు ఓర్చి తాను పార్టీని నడిపిస్తున్నానననే భావనలో ఉత్తమ్ ఉన్నారు. తాను తెగ కష్టపడిపోతున్నా.. ఇతరులు సహకరించకుండా.. ఇంకా విమర్శిస్తున్నారని.. ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో… పార్టీకి అంతో ఇంతో జవసత్వాలు రావాలంటే.. ఉత్తమ్‌ను మార్చాలన్న ప్రచారం జరుగుతూండటంతో… ముందుగానే.. వైదొలిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన.. ఉత్తమ్ చేస్తున్నారంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త టీం..!

ఉత్తమ్ ఇప్పటికే ఇప్పటికే నాలుగేళ్ల పదవికాలన్ని పూర్తి చేసుకున్నారు. రాహుల్ ఏఐసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సోనియా హయాంలో నియమించిన పీసీసీ అధ్యక్షులందరిని కొనసాగిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. దాంతో ఇప్పటివరకు ఉత్తమ్ టీపీసీసీ చీఫ్ గా కంటిన్యూ అవుతున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికల ఫలితాలని జీర్ణించుకోలేక పోతున్న అధిష్టానం పెద్దలు పార్లమెంట్ ఫలితాల తర్వాత టీకాంగ్రెస్‌లో సమూల మార్పులు ఖాయమని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close