మరో రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన..! మిగతావి ఎప్పుడు..?

తెలంగాణ రాష్ట్ర సమితి మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ నియోజకవర్గానికి కె.మాణిక్ రావు, మలక్ పేటకు చావ సతీష్ కుమార్ పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. గత ఎన్నికల్లో జహీరాబాద్ లో గీతారెడ్డిపై పోటీ చేసి మాణిక్ రావు.. మలక్ పేటలో బలాలాపై పోటీ చేసి సతీష్ కుమార్ ఓడిపోయారు. మళ్లీ వారిద్దరికే ఆయా స్థానాల్లో అవకాశం కల్పించారు. ఈ ఇద్దరు అభ్యర్థుల ప్రకటన… ఓ వైపు ఆశ్చర్యాన్ని మరో వైపు మిగిలిన నియోజకవర్గాల్లోని ఆశావాహుల్లో ఆక్రోశాన్ని నింపింది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే ప్రకటించడానికి ప్రత్యేకంగా ఎందుకు పెండింగ్‌లో పెట్టాలన్న సందేహం.. కాగా.. ఈ రెండింటినే ప్రత్యేకంగా ఎందుకు ప్రకటించడమన్న చర్చ మరో కారణం.

నిజానికి జహీరాబాద్ విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా పెద్ద గేమ్ ప్లాన్ ఆడారు. ఆ సీటును పెండింగ్‌లో పెట్టిన మరుక్షణం నుంచి.. గీతారెడ్డి.. టీఆర్ఎస్ లో చేరబోతున్నారన్న ప్రచారం ప్రారంభమయ్యేలా చేశారు. దీంతో.. టీఆర్ఎస్ తరపున ఆమె అభ్యర్థి అవుతారని అనుకున్నారు. కానీ గీతారెడ్డి నిర్మోహమాటంగా… మైండ్‌గేమ్ రాజకీయాలకు భయపడేదాన్ని కాదని ప్రకటించేశారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. వాస్తవానికి ఆయన హరీష్ రావు అనుచరుడు. హరీష్ రావు అనుచరులకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో.. ఇటీవలి కాలంలో.. ఆయన కేటీఆర్‌తో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు సమావేశమై.. పోటీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ కేటీఆర్‌ ఆ విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోలేదని.. తాజాగా తేలిపోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాణిక్ రావుకే చాన్సిచ్చారు. ఇక మలక్ పేట .. ఎంఐఎం సిట్టింగ్ సీటు. ఆ పార్టీతో ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందని కేసీఆర్ పదే పదే చెబుతూ ఉంటారు. అందుకే.. అక్కడ… ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీ కుమారుడు ఆజం ఆలీ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపినా కేసీఆర్ పట్టించుకోలేదు. డమ్మీ క్యాండిడేట్‌గచావ సతీష్ కు చాన్సిచ్చారు.

ఈ రెండు స్థానాల్లోనే అభ్యర్థులను ప్రకటించడంతో.. రేసులో ఉన్న మిగతా పెండింగ్ స్థానాల అభ్యర్థులు ఉసూరుమన్నారు. అంబర్ పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, చార్మినార్, చొప్పదండి, వరంగల్ తూర్పు, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, హుజూర్ నగర్, కోదాడలకు తెరాస అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో ఒక్క చార్మినార్ మినహా మిగతా అన్ని స్థానాల్లో అభ్యర్థిత్వం కోసం గట్టి పోటీ ఉంది. తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తారని.. ఆశపడిన ఈ నియోజకవర్గాల ఆశావహులంతా… తెలంగాణ భవన్‌కు వచ్చి నిరాశతో వెళ్లిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close