అసెంబ్లీ సమావేశాల్లో విమర్శల సెగలు!

వణికించే చలిలో విమర్శల మంటలు తప్పవా? తెలంగాణ శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వంపై నిప్పుడు చెరగడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 16 నుంచి జరిగే సమావేశాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శలు చేసే అవకాశం ఉంది.

కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు రైతు సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. రుణ మాఫీ అమలు, ప్రాజెక్టుల భూసేకరణ, నష్టపరిహారం తదితర విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండా అసెంబ్లీలో విమర్శనాస్త్రాలు సంధించడం ఖాయం.

డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీ ఎస్టీలకు భూమి పంపిణీ వంటి హామీల అమలులో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు చాలా కాలంగా విమర్శిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దును సమర్థించిన కేసీఆర్ ప్రభుత్వం, రైతుల కష్టాలను తీర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ నిందిస్తోంది. సామాన్య ప్రజలు కూడా డబ్బుకోసం పడుతున్న కష్టాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

జిల్లాల విభజన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలివి. జిల్లాల విభజనలో శాస్త్రీయత లేదని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపించాయి. అది రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయమని విమర్శించాయి. అటు బీజేపీ సైతం రైతు సమస్యలు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై దండెత్తడానికి సిద్ధమవుతోంది. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కేసీఆర్ సమర్థించినా, రాష్ట్రంలో అనేక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందంటూ కమలనాథులు కూడా విమర్శనాస్త్రాలు సంధించనున్నారు. అయితే సంఖ్యాపరంగా ప్రతిపక్షాన్ని నామమాత్రం చేయడంతో సభలో విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడానికి అధికార పార్టీ కూడా సిద్ధమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close