కేసీఆర్ తో స్నేహానికి మూల్యం చెల్లిస్తున్న తెదేపా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ల స్నేహం కొనసాగుతుంటే మరోపక్క తెరాస యధాప్రకారం తెదేపా ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆకర్షిస్తూ తెలంగాణాలో తెదేపాను పూర్తిగా తుడిచిపెట్టేసే పనిలో చాలా బిజీగా ఉంది. ఇదేదో చంద్రబాబు నాయుడు తెలియకుండా రహస్యంగా జరుగుతున్న వ్యవహారం కాదు. తెలంగాణ ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామరావు మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన కొందరు తెదేపా నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరిన సందర్భంగా నిన్న మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణాలో నుండి తెదేపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అది పరిమితం కాబోతుందని జోస్యం చెప్పారు.

వచ్చే నెలలో జరుగబోయే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెరాస పార్టీ హైదరాబాద్ లోని తెదేపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను తెరసలోకి రప్పించేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తోంది. తెరాస మంత్రులు హరీష్ రావు, కె.తారక రామరావు, తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నలుగురు తెదేపా ఎమ్మెల్యేలు వివేక్ (కుత్బుల్లాపూర్), గాంధీ (శేరిలింగంపల్లి) లను తెరాసలోకి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. వారిరువురిలో వివేక్ గౌడ్ తనకు తెరాసలో చేరే ఆలోచన, ఆసక్తి లేవని నిర్ద్వందంగా తేల్చి చెప్పగా, గాంధీ మాత్రం ఇంకా తెరాస నేతలతో మాట్లాడుతున్నట్లు సమాచారం. తెలంగాణాలో తెదేపాను పూర్తిగా తుడుచిపెట్టేసేందుకు తెరాస ఇంత బహిరంగంగా ప్రయత్నాలు చేస్తుంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏమాత్రం చింతిస్తున్నట్లు లేరు. పైగా తమ పార్టీని తుడిచిపెట్టేస్తున్న కేసీఆర్ తో స్నేహం కోసం పరితపించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close