ఆరోపణలు చేయకుండా కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్న కవిత !

రాజకీయ ఆరోపణలు చేయకుండా కోర్టుకెళ్లి స్టేలు కూడా తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరూపించారు. తనపై ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ ఒకరు.. మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆరోపణలు చేస్తున్నారని.. వాటికి మీడియాలో విస్తృత ప్రచారం లభిస్తోందని అందుకే ఆరోపణలు చేయకుండా నిలువరించాలని.. సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. ఢిల్లీ ఎంపీకి.. మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ఆరోపణలు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే రాజకీయ ఆరోపణలు చేయకుండా.. కోర్టు ఆదేశాలు పని చేస్తాయా లేదా అన్నది నిపుణులు కూడా చెప్పలేరు. గతంలో వైట్ చాలెంజ్ పేరుతో రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై ఆరోపణలు చేసినప్పుడు కూడా ఇలాగే సిటీ సివిల్ కోర్టుకు వెళ్లారు. అప్పుడుకూడా కోర్టు కేటీఆర్‌కు వ్యతిరేకంగా డ్రగ్స్ కేసులో ఎలాంటి ఆరోపణలు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు కవిత కూడా అదే తరహాలో ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

అయితే కవిపై చేసే ఆరోపణలు ఆగుతాయా అన్నది చెప్పడం కష్టమని రాజకీయవర్గాలంటున్నాయి. బీజేపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా అసలు విషయం బయట పెట్టాల్సింది మాత్రం సీబీఐ. ఈ అంశంలో సీబీఐ ప్రకటన చేసే వరకూ.. ఈడీ విషయాలు వెలుగులోకి తెచ్చే వరకూ కవితపై ఎన్ని ఆరోపణలు చేసినా అది రాజకీయమే. అయితే సీబీఐ ఒక వేళ కవిత పాత్రను ధృవీకరిస్తే.. అప్పుడు కూడా రాజకీయమే కానీ.. ఆధారాలున్న ఆరోపణలతో చేస్తున్న రాజకీయం అవుతుంది. ఇప్పటికైతే.. కవిత కోర్టు నుంచి ఊరట పొందారు. లిక్కర్ స్కాంలో ఆరోపణలు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇవి తెలంగాణ నేతలకూ వర్తిస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close