తెలకపల్లి వ్యూస్: పాలేరులో త్రిముఖ సమరమే

ఖమ్మం జిల్లా పాలేరులో మంత్రి తుమ్మలకూ కాంగ్రెస్‌ సిపిఎంలతో త్రిముఖ సమరమే జరగనుంది. కాంగ్రెస్‌ నాయకులు పూర్వపు ఎంఎల్‌ఎ మాజీ మంత్రి రాం రెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితను అభ్యర్థిగా నిర్ణయించి అందరి సహాయం అర్థించారు. అందుకోసం అధికారికంగా వైసీపీ అద్యక్షుడు జగన్‌ను భట్టి విక్రమార్క కలవడంలో చాలా సంకేతాలున్నాయి. ఇక విచిత్రంగా వారికి తెలుగుదేశం కూడా మద్దతు ప్రకటించింది! సానుభూతిని,కాంగ్రెస్‌ అభ్యర్థనను కారణంగా చూపించింది. ఏది ఏమైనా తెలుగుదేశం పోటీకి శ్రమపడబోదని ముందే తేలిపోయింది. శనివారంరాత్రి ఒక వివాహ విందులో తెలుగుదేశం ముఖ్యులను కలసినప్పుడు అది స్పష్టమైంది. అయినా అంతర్గత చర్చల ప్రక్రియ జరిపామనిపించి నిర్ణయం ప్రకటించారు. ఫలితం లేని పోరాటం చేయకుండా పరువు కాపాడుకున్నారు. బరువు తగ్గించుకున్నారు! ఈలోగా పువ్వాడ అజరు కుమార్‌ ఫిరాయింపు కాంగ్రెస్‌కు ఒకింత నష్టమైనా పాలేరులో ఆయన ప్రభావం పెద్దగా వుండదు.

సిపిఎంకు ఇక్కడ గణనీయమైన ఓటింగు వుంది. గతసారి వంటరిగా చేసినప్పుడే దరిదాపుగా మిగిలిన పార్టీలకు దగ్గరగా ఓట్టు తెచ్చుకుంది. అప్పుడు కాంగ్రెస్‌తో వున్న సిపిఐ ఇప్పుడు సిపిఎంను బలపర్చే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పుడు తెలంగాణలో వామపక్షాలు ఉమ్మడిగా వ్యవహరిస్తున్న రాజకీయ వాతావరణంలో బహుశా ఎంఎల్‌ గ్రూపులు కూడా మద్దతు తెల్పొచ్చు. తాము పార్టీలో చర్చించి చెబుతామని భట్టితో అన్నట్టు వచ్చిన వార్తలను సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించడమే గాక పోటీ చేస్తామనీ ప్రకటించారు. కనుక తుమ్మల వర్గం తీవ్రంగానే పోరాడవలసి వస్తుంది. ఖమ్మం, వరంగల్‌, సిద్ధిపేట మునిసిపల్‌ ఫలితాలకూ వరంగల్‌ జిహెచ్‌ఎంసి ఫలితాలకు తేడా గమనిస్తే ఇతర రాజకీయ శక్తులు కూడా మాయమై పోలేదని బోధపడుతుంది. కనుక పాలేరులో త్రిముఖ పోటీ గట్టిగానే జరుగుతుంది. ఇది ఒక విధంగా ఇతర రాజకీయ సమరాలకూ సూచిక అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close