మునుగోడులో పని ప్రారంభిచిన టీఆర్ఎస్ !

మునుగోడులో ఉపఎన్నిక తీసుకు వచ్చి … గెలిచి బీజేపీకి తిరుగులేదని అనిపించుకోవాలనుకుంటున్నారని టీఆర్ఎస్‌కు గట్టి నమ్మకం ఏర్పడింది. ఎక్కడ ఉపఎన్నికలు వస్తే అక్కడ టీఆర్ఎస్ దూకుడుగా ప్రారంభించే కార్యక్రమాలను మునుగోడులో ప్రారంభించేశారు. గతంలో మునుగోడులో ఇచ్చిన కల్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వల్లనే బౌన్స్ అయ్యాయని చెప్పి ఇప్పుడు కొత్త చెక్కులను మంత్రి జగదీష్ రెడ్డి పంచడం ప్రారంభించారు.

చాలా కాలంగా ప్రజల డిమాండ్‌గా ఉన్న గట్టుప్పలను ప్రత్యేక మండల కేంద్రం చేయడాన్ని నెరవేర్చారు. రెండు రోజుల కిందటే ఉత్తర్వులు కూడా వచ్చేశాయి. ఇప్పుడు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు. ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా భారీగా పనులు ప్రారభించడం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనవాయితీ. అందుకే తమకూ ఉపఎన్నిక వస్తే బాగుండని ప్రజలు అనుకుంటున్నారని గతంలో ప్రచారం జరిగింది. ఆ తరహాలోనే మునుగోడు ప్రజల్నీ టీఆర్ఎస్ సర్కార్ నిరాశ పరిచే పరిస్థితి లేదు.

అదే సమయంలో కాంగ్రెస్ నేతల్ని ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అనుచరులకు టీఆర్ఎస్ కండువా కప్పేందుకు ప్లాన్లు వేసుకుంటున్నారు. ఆదివారమే చేరికలు ప్రారంభించారు. ఓ సర్పంచ్‌, ఎంపీటీసీలకు మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పారు. త్వరలో మరికొంత మంది కీలక నేతల్ని లాగాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. అయితే రాజీనామా చేస్తానని.. ఉపఎన్నిక వస్తుందని.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం క్లారిటీగా చెప్పలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close