ఆంధ్రజ్యోతిపై టీటీడీ రూ. వంద కోట్ల పరువు నష్టం దావా..!

శ్రీవారి ఆలయంలో తవ్వకాలు .. పింక్ డైమండ్ మాయం.. శ్రీవారి హుండీల్లో డబ్బులు వేయవద్దు అంటూ.. ప్రచారం చేసిన.. రమణదీక్షితులను గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం.. టీటీడీలోని వ్యవహారాలను బయట పెడుతున్న మీడియాపై మాత్రం..తనదైన యాక్షన్ ప్రదర్శిస్తోంది. ఆంధ్రజ్యోతి పత్రికపై వంద కోట్ల రూపాయల పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయాలని.. పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. ఫలానా కథనం రాసి.. ప్రతిష్ట తీశారనే విషయాన్ని బహిరంగంగా చెప్పకపోయినా.. పిటిషన్ మాత్రం వేయాలని నిర్ణయించుకున్నట్లుగా టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.

కొన్నాళ్ల క్రితం..లడ్డూ ధరలు పెంచాలని.. టీటీడీ ప్రయత్నించింది. ఆ విషయాన్ని ఆంధ్రజ్యోతి బయట పెట్టింది. అలాగే.. పలు అంశాలపై.. టీటీడీ చర్యలను ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తూ వస్తోంది. దీంతో పలు రకాల వివాదాలు తెరపైకి వచ్చాయి. అన్యమత విషయంలోనూ.. టీటీడీకి చిక్కులు ఏర్పడ్డాయి. దీన్నే తమ ప్రతిష్టమకు భంగంగా భావించిన టీటీడీ పెద్దలు… ఆ ప్రతిష్టను శ్రీవారికి ఆపాదించేసి.. కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై.. ఇలా వంద కోట్లకు టీటీడీ పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేసింది.

వారు టీటీడీపై చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. నేరుగా.. శ్రీవారి ప్రతిష్టకే మచ్చ తెచ్చేలా ఆరోపణలు చేశారు. కానీ వారిపై వేసిన పిటిషన్లను.. టీటీడీ కొద్ది రోజుల కిందట ఉపసంహరించుకుంది. వారు చేసిన ఆరోపణలు.. దిగజార్చిన ప్రతిష్టపై.. కనీసం వారి దగ్గర క్షమాపణ పత్రం కూడా టీటీడీ అడగలేదు. కానీ ఇప్పుడు మీడియాపై… గురి పెట్టి… వివాదాస్పద నిర్ణయాలను మీడియాలో రాకుండా చేయాలనుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close