ఏ క్షణమైనా టీవీ5 మూర్తి అరెస్ట్..!?

మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసహనం అరెస్టులకు తెగబడుతోందా..? తప్పులు ఎత్తి చూపిస్తే కేసులు పెట్టేందుకూ వెనుకాడటం లేదా..? టీవీ5 జర్నలిస్ట్ మూర్తిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చని బుధవారం సాయంత్రం సీఐడీ వర్గాల నుంచి మీడియాకు లీక్ వచ్చింది. మూర్తి చర్చా కార్యక్రమాలు అన్నీ.. అగ్రెసివ్‌గా ఉంటాయి కానీ.. దానికే అరెస్ట్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఏం కేసు పెట్టారు..? ఎందుకు పెట్టారు..? లాంటి విషయాలేమీ పెద్దగా బయటకు రాలేదు. కానీ మూడు ప్రత్యేక బృందాలు ఆయనను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నాయని మాత్రం మీడియాకు సమాచారం అందింది. ఇదే విషయాన్ని టీవీ5 యాజమాన్యానికి కూడా సీఐడీ పోలీసులు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇంతకి జర్నలిస్ట్ మూర్తి చేసిన నేరం ఏమిటో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ప్రభుత్వం ఇటీవలి కాలంలో వైరస్ విషయంలో ప్రభుత్వం చెప్పింది మాత్రమే ప్రజలకు వివరించాలని… ఇంకేమైనా చెబితే… విపత్తుల నిర్వహణ కింద కేసులు పెడతామని హెచ్చరిస్తూ వస్తోంది. బహుశా.. మూర్తి నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లో.. ఏదైనా.. అంశంపై.. ఆయన ప్రభుత్వం ప్రకటించని సమాచారాన్ని చెప్పి ఉంటారేమోనని.. ఆయనను అరెస్ట్ చేయడానికి దానినో అవకాశంగా మల్చుకుని ఉంటారని భావిస్తున్నారు. ఆయనపై పెట్టిన కేసులేమిటో.. బయటకు చెప్పిన తర్వాతే.. అసలేం తప్పు జరిగిందో తెలుస్తుంది. నిజానికి బుధవారం రాత్రే… మూర్తిని అరెస్ట్ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం అసహనానికి గురవుతోందంని… గతంలో… సాక్షి మీడియా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకోవాలని మీడియా వర్గాలు పోస్టులు పెట్టడం ప్రారంభించాయి.

ప్రభుత్వానికి టీవీ5 మూర్తి చాలా కాలంగా ఇబ్బందికరంగా మారారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన ప్రత్యక్షంగా పోరాడుతున్నారు. అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయంపై అండగా నిలబడ్డారు. ప్రజలకు నష్టం కలిగించే ప్రతీ నిర్ణయాన్ని తన చర్చా కార్యక్రమాల్లో చర్చించారు. తప్పొప్పులు బయటపెట్టారు. ఆయనపై వైసీపీ సోషల్ మీడియా చాలా తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చేసింది. ఇప్పుడు వాటన్నింటికీ అరెస్ట్‌తో లెక్క తేల్చుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లుగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close