ఫేక్ న్యూస్ స్పెషలిస్టుగా “టీవీ9”..!

” బంగారు గుడ్లు పెట్టే బాతు – అత్యాశకుపోయిన దాని యజమాని ” కథ .. చిన్న పిల్లలకు చెప్పే నీతి కథల్లో ఇప్పటికీ ఉంటుంది. చిన్న పిల్లలకు ఆ కథబాగానే అర్థమవుతోంది కానీ.. అలాంటి నీతులు కోకొల్లలుగా చెప్పే.. మీడియా వారికి మాత్రం అర్థం అవుతున్నట్లుగా లేదు. తెలుగులో తిరుగులేని చానల్‌గా ఉన్న టీవీ9 విషయంలోనే ఇది జరుగుతోంది. ఏ మీడియాకు అయినా విశ్వసనీయతే బలం. ప్రజల్లో అది కోల్పోతే.. జరిగేది పతనమే. ఇప్పటికే ఎన్నో మీడియా సంస్థలు.. యాజమాన్య స్వార్థ ప్రయోజనాల కోసం… పని చేసి అలాంటి పతనాన్ని.. చవి చూశాయి. ఈ కోవలోనే టీవీ9 కూడా చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

కొన్నాళ్లుగా టీవీ9 ఫేక్ న్యూస్ మాత్రమే ప్రసారం చేస్తోంది. యాజమాన్యానికి అవసరం అయినట్లుగా.. వారికి ఇష్టం లేని.. లేదా.. వారికి అవసరమైన రాజకీయ పార్టీ కోసం.. ఫేక్ న్యూస్‌లు మాత్రమే ప్రసారం చేస్తోంది. అదీ కాదంటే.. జరిగిన విషయాల్ని ఫేక్‌గా చెప్పడానికి కూడా వెనుకాడటం లేదు. తమ యాజమాన్యానికి దగ్గర అయిన రాజకీయ పార్టీలకు కష్టం వస్తుందంటే.. ఆ వార్తలను స్కిప్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఎస్‌ఈసీ రమేష్ కుమార్ రాసిన లేఖ ఫేక్ అంటూ.,.. ఆ చానల్ ఎడిటర్ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పడిన తిప్పలేంటో అందరూచూశారు. ఆ లేఖను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఫేక్ కాదని కాస్త జర్నలిజం అనుభవం ఉన్న వారందరికీ స్పష్టమవుతుంది. అలాంటి లేఖలు రాసినప్పుడు.. ఎవరు కూడా తాను రాశానని బయటకు చెప్పుకోరు. ఆ లాజిక్ తెలిసే… తమ అభిమాన పార్టీపై మరకపడకుండా ఉండటం కోసం .. దాన్ని ఫేక్ అని చెప్పడానికి సాహసించారు.

ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి విషయంలో చేస్తున్న హడావుడి అందరూ చూస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఉరిశిక్ష వేయడానికి తగ్గ అభియోగాల్ని ఇప్పటికే టీవీ9 మోపింది. ఇందులో వాస్తవాలెన్ని ఉంటాయో.. ఆ కథనాలను ప్రిపేర్ చేస్తున్న వారికి కూడా తెలుసు. ఇప్పుడీ టీవీ9 వార్తల ప్రహసనం ఎలా తయారయింది అంటే.. జనం కూడా.. వాళ్లంతే.. అని లైట్ తీసుకునేంత. రేవంత్ రెడ్డిపై ఎన్ని కథనాలు వేసినా.. ప్రజల్లో కనీస కదలిక రాలేదంటే.. టీవీ9 ప్రభావం ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు టీవీ9 ఏదైనా ఇష్యూ టేకప్ చేస్తే.. దానికి ఉన్న సేలబుల్ పవర్ కారణంగా.. ఇతర చానళ్లు రెడీ అయిపోయేవి. ఇప్పుడా పరిస్థితి పోయింది.

ఒకప్పుడు వార్త దినపత్రిక.. ఈనాడుతో పోటీగా.. మార్కెట్లోకి దూసుకు వచ్చింది. కొన్ని కొన్ని జిల్లాల్లో ఈనాడును మించిపోయి సర్క్యూలేషన్ సాధించింది కూడా. కానీ.. అలా వచ్చిన అవకాశాన్ని వార్త యాజమాన్యం రాజకీయ ప్రయోజనాల కోసం.. రాజ్యసభ లాంటి పదవుల కోసం వాడుకుంది. ఫలితంగా ఈనాడును అధిగమించాల్సిన వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇప్పుడు టీవీ9ది కూడా అదే పరిస్థితి. మొదట్లో ప్రొఫెషల్ జర్నలిస్టులు వేసిన పిల్లర్లు బలంగా ఉంది కాబట్టి.. కొన్ని రోజులు నిలబడుతుందేమో కానీ.. ఇదే పద్దతి కొనసాగిస్తే.. టీవీ9 మరో వార్త అవడం ఖాయమనడంలో ఎలాంటి సందేహం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close