కాంగ్రెస్‌లోకి ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ..! రేవంత్ చెప్పింది నిజమే..!?

కొడంగల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు… రేపోమాపో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు… వారిని ఆపే సత్తా ఉంటే ఆపుకోవాలని సవాల్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారేమోనన్న అనుమానం కూడా వచ్చింది. కానీ నిజంగానే ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరొకరు… సీతారాం నాయక్. పార్టీ మారే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి. ఈయన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్రధాన అనుచరునిగా కొనసాగుతున్నారు.

చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చాలా కాలంగా టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారు. రెండు నెలల నుంచి టీఆర్ఎస్ నేతలంతా ప్రచారంలో పరుగులు పెడుతున్నా… కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం.. ఎక్కడా కనిపించడం లేదు. ప్రచారం చేయడం లేదు. కానీ తన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఎక్కడా కారు గుర్తుకు ఓటేయమని చెప్పడం లేదు. ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యతపై విశ్వేశ్వర్‌రెడ్డికి అభ్యంతరాలున్నాయి. రేవంత్ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన తాండూరులోనే ఉన్నారు. అక్కడ మీడియా పార్టీ మార్పుపై ప్రశ్నిస్తే.. ఇద్దరు కాదు.. ముగురు కాంగ్రెస్‌లో చేరుతారంటూ వ్యాఖ్యానించి వెళ్లిపోయారు. అంతే కాదు.. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో.. టీఆర్ఎస్ అన్ని స్థానాల్లోనూ ఎదురీదుతోందని ప్రకటించారు.

మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తేలిపోయింది. ఆయనకు ఈ సారి టిక్కెట్ లేదని.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారట. మహబూబా బాద్ నుచి పోటీకి… కేరళ క్యాడర్ కు చెందిన ఐపీఎస్‌ అధికారి లక్ష్మణ్‌ నాయక్‌ను టీఆర్‌ఎస్‌ ప్రోత్సహిస్తోంది. మహబూబాబాద్‌ ఎంపీగా కాంగ్రెస్‌ నుంచి గతంలో పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ ఈసారి మహబూబాబాద్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ సారి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి.. అవకాశం వస్తుందని సీతారాం నాయక్ నమ్కంతో ఉన్నారు. వీరందరూ.. ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు సోనియా వచ్చిన సమయంలో పార్టీలో చేరుతారని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఇద్దరు ఎంపీలు అధికార టీఆర్‌ఎస్‌ను వీడటం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close