యూఏఈలో ఐపీఎల్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సర్వం సిద్ధం అవుతోంది. ఈ సారి యూఏఈలో లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసేసి..అధికారికంగా ప్రకటన చేసింది. సెప్టెంబర్‌ 19నుంచి షార్జా, దుబాయ్, అబుదాబిల్లో మ్యాచులు జరుగుతాయి. ఒకప్పుడు షార్జా అంటే. క్రికెట్‌కు పెట్టింది పేరు. గత కొన్నేళ్ల కాలంలో అక్కడ టోర్నీలు జరగడమే గగనం అయిపోయింది. ఇప్పుడు ఐపీఎల్‌తో మరోసారి షార్జా వెలిగిపోనుంది. దుబాయ్, అబుదాబీల్లోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉన్నస్టేడియాలు ఉన్నాయి. దీంతో.. ఈ మూడు నగరాల్లోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని నిర్ణయించారు.

సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్‌ 8 వరకు జరుగుతుంది. వచ్చే నెలలోనే జట్లన్నీ.. దుబాయ్‌కు చేరుకుంటాయి. అక్కడ క్వారంటైన్ పూర్తయిన తర్వాత టోర్నీ ప్రారంభిస్తారు. యుఏఈలో ప్రస్తుతం కరోనా వైరస్.. కంట్రోల్‌లో ఉంది. కఠినమైన చర్యలు తీసుకోవడంతో.. పాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి ఉంచడంతో.. అక్కడ వైరస్ పెద్దగా ప్రబలడం లేదు. ఆ దేశాలు అంతర్జాతీయ విమానాల రాకపోకులను కూడా ప్రారంభించాయి. ఐపీఎల్ నిర్వహణకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు యుఏఈ అంగీకారం తెలిపింది. దాంతో.. ప్రతిష్టాత్మక టోర్నీకి మార్గం సుగమం అయింది.

ఇప్పటికే టీ 20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేసింది. ఐపీఎల్ కోసమే వాయిదా వేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఆ ప్రపంచ కప్ వాయిదా వేయడంతో.. ఐపీఎల్‌కు సమయం దొరికింది. మాములాగా అయితే మార్చి 29న ప్రారంభం కావాల్సి ఉంది. మేలో ముగియాల్సి ఉంది. కానీ.. కోరనా కారణంగా మొత్తం మారిపోయింది. 2014లో ఐపీఎల్ సగం టోర్నీని యూఏఈలోనే నిరవహించారు. యూఏఈలో టోర్నీ నిర్వహణకు భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close