షాపు అద్దె రూ. 1, ఇసుక టన్ను రూ.30..! ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఏపీ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతాలు కనిపిస్తున్నాయి. టన్ను ఇసుక.. రూ. 30 కే ఇవ్వబోతున్నారు. ఇంటికి తీసుకొచ్చి మరీ.. ఎక్కడ కావాలంటే.. అక్కడ పోసి వెళ్లబోతున్నారు. ఇదే కాదు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నారు కాబట్టి.. ఆ స్ఛాయిలో.. ప్రభుత్వానికి షాపులు అద్దెకిచ్చేందుకు… యజమానులు కూడా పోటీ పడుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు రూపాయికే అద్దెకిస్తామంటూ.. వందల రూపాయిల ఖర్చుతో…టెండర్లు దాఖలు చేస్తున్నారు.

మద్యం షాపులకు రూ. 1కే అద్దెకిస్తామని క్యూలు..!

ఏపీ సర్కార్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి తెస్తోంది. దీని ప్రకారం.. ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించబోతోంది. దీనికి షాపులు కావాలి కాబట్టి… అద్దెకు తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. ఓపెన్ టెండర్లు స్వీకరించారు. ఏలూరు, పెదవేగి మండలాల పరిధిలో ఒకరికొకరు పోటీపడి అతి తక్కువ ధరకే షాపులు అద్దెకిచ్చేందుకు ఒప్పుకున్నారు. కేవలం రూ.1కే షాపును ఇచ్చేందుకు ముందుకు వచ్చారట. ఏలూరు నగరంలోని 30వ డివిజన్‌లో షాపు, పెదవేగి మండలం కూచింపూడి, కొప్పులవారిగూడెం, కొప్పాక గ్రామంలోని మద్యం దుకాణాలను రూ.1కే ప్రభుత్వానికి అద్దెకు ఇస్తున్నారని వైసీపీ మీడియా సాక్షినే.. ఘనంగా ప్రకటిస్తోంది.

ఇసుక టన్ను రూ. 30కే..!

ప్రభుత్వం ఎట్టకేలకు నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెలుస్తోంది. దీనికి సంబంధించి.. రీచ్‌ల నుంచి స్టాక్‌ పాయింట్లకు ఇసుక తరలించేందుకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో రూ. 30కే టన్ను ఇసుక తరలిస్తామని టెండర్లు వేశారు. ఒక్కో యూనిట్‌కు సంబంధించి రేవులో ఇసుక లోడింగ్‌ చేసే కూలీల ఖర్చు, అక్కడి నుంచి స్టాక్‌పాయింట్‌ వరకు రవాణా ఖర్చు, మళ్లీ స్టాక్‌పాయింట్‌లో అన్‌లోడింగ్‌.. ఆ తర్వాత కస్టమర్‌కు ఇసుక లోడింగ్‌ ఖర్చు వరకూ టెండరుదారుడిదే బాధ్యత. అంతా కలిపి.. రూ. 30లకే తరలిస్తారట. ఇదెలా సాధ్యమని ఎవరూ ఆలోచించడం లేదు.

ఎందుకిలా చేస్తున్నారు…?

మద్యం షాపులకు రూ. ఒక్కటికే… తమ షాపు అద్దెకు ఇస్తే.. యజమానులకు వచ్చే లాభం ఏమిటి..? రూ. 30కి ఇసుక తరలిస్తే.. వారికి ఇచ్చే లాభం ఏమిటి..? ఇవన్నీ… చాలా మందికి వచ్చే సందేహాలు. ఎలాగోలా.. వ్యవస్థలో ఇరుక్కుంటే.. ఒక్క రూపాయినే కోటిగా మార్చుకునే వెసులుబాటు వారికి వస్తుంది… రూ. 30ని మూడు కోట్లుగా మార్చుకునే సౌలభ్యం వస్తుంది. అందుకే.. వారిలా.. చేస్తున్నారని.. ఎవరికైనా అర్థమైపోతుంది. మరి ప్రభుత్వం ఏం చేయబోతోందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close