పవన్ కళ్యాణ్ తో చెడలేదన్న ఉండవల్లి

మాజీ ఎంపీఉండవల్లి అరుణ్ కుమార్ ఆమధ్య పవన్ కళ్యాణ్ సంయుక్త నిజనిర్ధారణ కమిటీ లో పాల్గొనడం, కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి రూపొందించిన నివేదికకు తనవంతు సమాచారం అందించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడడం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కి ఆయనకు చెడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో , ఇదే ప్రశ్నను ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఆయనకు సంధించింది . దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

ఆ ప్రముఖ ఛానల్ లోని యాంకర్, మీకు పవన్ కళ్యాణ్కు ఈమధ్య చెడినట్లు కనిపిస్తోందని, ప్రత్యేకించి చంద్రబాబుని మీరు కలిశాక అలాంటి అభిప్రాయం జనాల్లో కలుగుతోందని ప్రశ్నించగా ఉండవల్లి కుండబద్దలు కొట్టినట్టు సమాధానమిచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏర్పాటుచేసిన జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ లో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారని , అలాంటి నిపుణులతో పాటు తనను కూర్చోపెట్టి తనకెంతో గౌరవించాడని అందువల్ల పవన్ కళ్యాణ్ మీద తనకు ఇప్పుడు గౌరవం అలాగే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక చంద్రబాబుని తానే అపాయింట్మెంట్ కోరినట్టు కొన్ని మాధ్యమాలలో వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. తాను చంద్రబాబు అపాయింట్మెంట్ ఎప్పుడు కోరలేదని, చంద్రబాబే తనను ఆహ్వానించాడని, ముఖ్యమంత్రి పిలిచారు కాబట్టి వెళ్లి కలిశానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ యాంకర్ అక్కడితో ఆగకుండా, జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ తర్వాత పవన్కళ్యాణ్ మీకు ఎప్పుడు పెద్దపీట వేయాలేదే అని ప్రశ్నించగా, తాను రాజకీయాల నుంచి రిటైర్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ కు తెలిపానని అందువల్ల ఆయన తన వ్యవహారాలలో కి నన్ను పిలవక పోయి ఉండవచ్చని చెబుతూ పవన్ కళ్యాణ్ మీద తన అభిప్రాయం ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుందని వ్యాఖ్యానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close