చంద్రబాబు గెలవాలని కోరుకున్నాను: ఉండవల్లి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ రాజశేఖరరెడ్డికి వీర విధేయుడుగా పేరున్నరాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, గత ఎన్నికలలో తెలుగుదేశం గెలవాలని కోరుకున్నట్లు తెలిపారు. జీవితంలో ఏనాడూ తెలుగుదేశం పార్టీని సమర్థించని తాను మొట్టమొదటిసారి, గత ఎన్నికల సమయంలో బాబుకు-జగన్‌కు పోటీ ఏర్పడినపుడు బాబు గెలవాలని కోరుకున్నానని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో తనకు మిత్రులు, సన్నిహితులు ఎంతోమంది ఉన్నారని, తన స్థానంలో ఎవరున్నా జగనే గెలవాలని కోరుకుంటారని, అయితే తాను మాత్రం చంద్రబాబు గెలిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించానని చెప్పారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబులాంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి అయితే ప్రయోజనం చేకూరుతుందని భావించినట్లు తెలిపారు. కేంద్రంలో మోడి గెలవబోతున్నాడు కనుక, బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీ గెలిస్తే రాష్ట్రానికి ఏ పనైనా జరుగుతుందని అనుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు గెలిచినప్పటికీ, ఆయననుంచి తాను ఆశించినట్లు జరగటంలేదని ఉండవల్లి అన్నారు.

అమరావతిని చంద్రబాబు తన కోటగా పరిగణిస్తున్నరని, తన కోట ఎలా కట్టుకోవాలి అన్నదానిపైనే ఆయన దృష్టిపెడుతున్నారని ఆరోపించారు. 12 చిన్నచిన్న సిటీలు అమరావతి చుట్టూ వస్తాయని చెబుతున్నారని, అంటే చుట్టూ ఉన్న ఊళ్ళను జనం వదిలివెళ్ళిపోవాల్సి ఉంటుందని అన్నారు. అమరావతిని తప్ప మిగతా రాష్ట్రాన్ని గాలికొదిలేశారని, గోదావరి జిల్లాలనయితే పట్టించుకోవటమే మానేశారని ఆరోపించారు. 30మంది చనిపోయిన పుష్కరఘాట్ దుర్ఘటనపై విచారణ అతీగతీ లేదన్నారు.

బాక్సైట్ తవ్వకాల వివాదంపై మాట్లాడుతూ, చంద్రబాబు శ్వేతపత్రాలు అవాస్తవాలని ఉండవల్లి విమర్శించారు. మంత్రి యనమలతో బాబు అబద్ధాలు చెప్పిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలతో శ్వేతపత్రాలు విడుదల చేయాలని, అనంతరం వాటిపై చర్చ పెట్టాలని సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో ఇలాగే చేసేవారని చెప్పారు. కేబినెట్‌లో కొందరు ఆరోపిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డికి బాక్సైట్ కంపెనీల బినామీలు ఉన్నట్లయితే ఆయనపై తక్షణమే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోనని ఉండవల్లి స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close