ఏమిటా మాటలు: పాకిస్తాన్ కు అమెరికా వార్నింగ్

భారత్ సర్జికల్ దాడుల తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్తాన్ లోని నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు. అవసరమైతే భారత్ పై అణుబాంబు వేస్తామంటూ కొందరు పాక్ నేతలు పదే పదే బెదిరిస్తున్నారు. శుక్రవారం పాక్ రక్షణ శాఖ మంత్రి కూడా ఇలాగే వ్యాఖ్యానించారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. పదే పదే అలాంటి కామెంట్స్ మానుకోవాలంటూ నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.

తన భూభాగంలో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను కొనసాగనివ్వ కూడదని అమెరికా మరోసారి హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించిన సంస్థలన్నింటిమీదా ఉక్కుపాదం మోపాల్సిందేనని తేల్చిచెప్పింది. కొన్ని సంస్థలను టార్గెట్ చేయడం, భారత్ కు వ్యతిరేకంగా కొన్ని సంస్థలను పెంచి పోషించడం మానుకోవాలని హెచ్చరించింది.

భారత్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోవాలని ఇటీవలి కాలంలో అమెరికా అనేక సార్లు పాక్ కు సూచించింది. అయినా అది పెడచెవిన పెట్టింది. దానికి పలితం అనుభవిస్తోంది. భారత్ లక్షిత దాడుల తర్వాత పాక్ తరఫున మాట్లాడే దేశమేదీ లేకుండా పోయింది. చివరకు చైనా కూడా పాక్ కు అండగా ప్రకటన ఏదీ చేయలేదు. ప్రపంచం మొత్తం పాకిస్తాన్ నే తిడుతోంది. ఉగ్రవాద సంస్థల మధ్య తేడాలుచూపవద్దని , ముష్కరులందరినీ టార్గెట్ చేయాలని అన్ని దేశాలూ సూచిస్తున్నాయి.

ప్రస్తుతం పాక్ పరిస్థితి తేలుకుట్టిన దొంగలా ఉంది. ఉగ్రవాద శిబిరాలపై భారత్ మరోసారి దాడి చెయ్యదనే గ్యారంటీ లేదు. అలాగని వాటిని మూసేస్తే టెర్రరిస్టులు పాక్ పాలకులనే టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. తన భూభాగంలోని తీవ్రవాద శిబిరాలను మూసెయ్యడం కూడా పాకిస్తాన్ కు కష్టమే కావచ్చు. వాటికి ఆర్మీ, ఐఎస్ఐ అండ ఉంది. కాబట్టి ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవడం మినహా ఏమీ చేయలేకపోవచ్చు. ఆర్మీ ఏదైనా దుందుడుకు నిర్ణయం తీసుకుంటే భారత్ అతి కర్కశంగా తిప్పి కొడుతుంది. అటు అంతర్జాతీయంగానూ మద్దతు భారత్ కే ఉంది. ఉంటుంది. అందుకే, పాక్ పాలకులకు దిక్కుతోచడం లేదు. భారత్ మాత్రం దేనికైనా రెడీగానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close